నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలివే..
సాక్షి లైఫ్ : సుగంధ ద్రవ్యాలు, మూలికలు వంటి అనేక సాధారణ పదార్థాలను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులతోపాటు పలురోగాలను నిర్మూలించడంలో నెయ్యి పాత్ర ఎంతో కీలకం. సీజనల్ ఫీవర్, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి వాటిని నయం చేయడంలో నెయ్యి సహాయపడుతుంది. నెయ్యిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలున్నాయి.
సీజనల్ అలెర్జీలు,ఇతర వ్యాధులతో పోరాడటానికి కావాల్సిన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో జలుబు, జ్వరం మరియు రద్దీ నుండి ఉపశమనం పొందడానికి మీరు ఈ మార్గాల్లో నెయ్యిని ఉపయోగించవచ్చు.
నెయ్యి - అల్లం..
ఒక చెంచా నెయ్యి కరిగించి, అందులో తాజాగా తురిమిన అల్లం వేసి తింటే ఎంతోమంచిది. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల చలికాలంలో కఫం తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది.
నెయ్యి-పసుపు-పాలు..
నెయ్యి, పసుపు, మిరియాలు, పాలు కలిపి తాగడం వల్ల చలికాలంలో వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జలుబు, జ్వరం నుంచి తొందరగా విముక్తి కలిగిస్తాయి.
నెయ్యి- నల్ల మిరియాలు టీ..
ఒక కప్పు వేడి నీటిలో లేదా హెర్బల్ టీలో ఒక టీస్పూన్ నెయ్యి, చిటికెడు నల్ల మిరియాలు కలపండి. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పానియంలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు పలురకాల వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
నెయ్యి -లవంగాలు..
కొన్ని లవంగాలను నెయ్యిలో వేడి చేసి, తేనెతో కలిపి పేస్ట్ లాగా చేసి తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు నయమవుతాయి.
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు కారణాలివే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
