హైదరాబాద్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నూతన ఆసుపత్రి ప్రారంభం.. 

సాక్షి లైఫ్ : కిడ్నీలు, మూత్రపిండాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రత్యేకత కలిగిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్ యూ) బంజారాహిల్స్‌లో తమ ప్రధాన ఆసుపత్రిని ప్రారంభించింది. 150 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి, యూరో-నెఫ్రో చికిత్సలకు దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రిగా నిలిచింది. ఈ కొత్త ఆసుపత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్‌లు, రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ వంటి అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

పెరుగుతున్న యూరాలజికల్ సమస్యలు..  

ఈ సందర్భంగా ఏఐఎన్ యూ ఛైర్మన్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి. మల్లికార్జున మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న యూరాలజికల్ సమస్యలను పరిష్కరించడానికి అధునాతన సాంకేతికత ఎంత అవసరమో వివరించారు. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి కారణాల వల్ల కిడ్నీ వ్యాధులు (సికెడి) ఎక్కువవుతున్నాయని, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో 50-60శాతం మందికి ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్య ఉంటుందని తెలిపారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ఏటా 2.5శాతం పెరుగుతోందని, ఇది భారతీయ పురుషుల్లో రెండో అతిపెద్ద క్యాన్సర్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు.
 
పిల్లల్లో కిడ్నీ వ్యాధులు, నివారణ చర్యలు.. 

 దేశంలో 11 లక్షల మంది పిల్లలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, ఈ సమస్యలను నివారించడానికి టెక్నాలజీతో కూడిన చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ మల్లికార్జున తెలిపారు. రోబోటిక్, ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ సర్జరీల వల్ల చికిత్సలో కచ్చితత్వం, వేగం పెరుగుతాయని ఆయన అన్నారు.

నివారణపై దృష్టి..  

ఏఐఎన్ యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి మాట్లాడుతూ, తమ ఆసుపత్రి యూరో-ఆంకాలజీ, ఆండ్రాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ వంటి సబ్-స్పెషాలిటీలపై కూడా దృష్టి సారించిందని చెప్పారు. కేవలం చికిత్స మాత్రమే కాకుండా, వ్యాధుల నివారణపైనా తాము దృష్టి పెట్టామని, ఇందులో భాగంగా తెలంగాణ గ్రామాల్లో ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనివల్ల వ్యాధులను ముందుగానే గుర్తించి, చికిత్స అందించవచ్చని ఆయన అన్నారు.

 భవిష్యత్ ప్రణాళికలు..  

ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి మాట్లాడుతూ, పెరుగుతున్న యూరాలజీ, నెఫ్రాలజీ అవసరాలను తీర్చడానికి దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏఐఎన్ యూసీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, బంజారాహిల్స్ ఆసుపత్రిని దేశంలోనే నమ్మకమైన సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గత ఆరేళ్లలో ఒక ఆసుపత్రి నుంచి తొమ్మిది ఆసుపత్రులకు విస్తరించామని, రాబోయే 18-24 నెలల్లో మరో మూడు కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఏఐఎన్ యూ దేశంలోని ఏడు యూనిట్లలో 5 లక్షల మంది రోగులకు సేవలందించింది. 1200కు పైగా రోబోటిక్ సర్జరీలు, 300కు పైగా కిడ్నీ మార్పిడులు, 2 లక్షలకు పైగా డయాలసిస్ సెషన్లు నిర్వహించింది.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

Tags : nageshwar-reddy kidneys-health neurology hyderabad ainu-doctors ainu nephrology asian-institute-of-nephrology-and-urology urologists robotic-rehabilitation
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com