యువతలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలు..? 

సాక్షి లైఫ్ : కొన్ని దశాబ్దాల క్రితం వరకు మెదడు సంబంధిత వ్యాధులు కేవలం వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి. అవి వయస్సు పైబడేకొద్దీ వచ్చే  సమస్యలుగానే పరిగణించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు యువత కూడా వాటి బారిన పడుతున్నారు. ప్రస్తుతం యువతలో అధిక సంఖ్యలో బ్రెయిన్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రక్త ప్రసరణ.. 

మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య ను పక్షవాతం అని,పెరాలసిస్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ జబ్బు కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 

ఆందోళన కారణంగానే కాకుండా యువతలో పక్షవాతం ముప్పు పెరుగుతోందని, అందుకు ధూమపానం,మద్యం, మధుమేహం వంటి మూడు ప్రధాన కారణాలుగా మారాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం.. 

ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలందరూ దాని బారీ నుంచి తమను తాము రక్షించుకోవడం అవసరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 ముఖ్యంగా  జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమని, నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతాయని వైద్యులు అంటున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం నివారణ చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతోంది.. ?

యువకులలో స్ట్రోక్‌కు సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలు వృద్ధుల కంటే భిన్నంగా ఉండవచ్చు. ధూమపానం,మద్య పానం, మధుమేహం, అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిల కారణంగా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయని,  దురదృష్టవశాత్తూ యువతలో ఈ ప్రమాదం మరింత వేగంగా పెరుగుతోందని వైద్యలు వెల్లడిస్తున్నారు.

యువతలో అధిక రక్తపోటు సమస్య.. 

 అధిక రక్తపోటు సమస్య యువతలో సర్వసాధారణంగా కనిపిస్తుంది, ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు విషయంలో, ధమనుల గోడలపై అధిక ఒత్తిడి ఉంటుంది, దీని కారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు పగిలిపోతాయి లేదా ఆగిపోతాయి. ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి అథెరోస్క్లెరోసిస్‌కు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమని పరిశోధనల్లో తేలింది. అధిక రక్తపోటు 20-40 సంవత్సరాల వయస్సు గల 8 మందిలో ఒకరిపై ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురితమైంది.

మధుమేహం వల్ల కూడా ఈ ప్రమాదం సంభవించవచ్చు.. 

మధుమేహం సమస్య యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. ఇది స్ట్రోక్ ప్రమాదానికి ప్రధాన కారణమవుతుంది. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువట. మధుమేహం సమస్య  నరాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది. చిన్న పిల్లల్లో కూడా మధుమేహం ముప్పు వేగంగా పెరుగుతోందని శాస్త్రవేత్తల బృందం ఒక అధ్యయనంలో వెల్లడించింది.

యువతలో ధూమపానం పెద్ద ప్రమాదం.. 

ధూమపానం కారణంగా, మీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2018 అధ్యయనంలో వరుసగా స్ట్రోక్ వచ్చిన మూడు సంవత్సరాలలో 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఉన్నారు. రోజూ సిగరెట్ తాగేవారిలో ఇతరులతో పోలిస్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ధూమపానం స్ట్రోక్‌కు దారితీసే అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.


 

Tags : brain-health

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com