భారతదేశంలో ఈరోజు కోవిడ్ కేసులు..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో కరోనా వైరస్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 514 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 3422 కి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదయం 8 గంటలకు అందించిన గణాంకాల ప్రకారం, 24 గంటల వ్యవధిలో ముగ్గురు చనిపోయారు. మహారాష్ట్రలో రెండు, కర్ణాటకలో ఒకటి.
డిసెంబర్ 5, 2023 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. అయితే కరోనా కొత్త వేరియంట్ JN.1 చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా, కేసులు మరింతగా పెరుగుతున్నాయి.
డిసెంబర్ 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న ఒక రోజులో గరిష్టంగా 841 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి. మొత్తం యాక్టివ్ కేసులలో, 92 శాతం మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా కోలుకుంటున్నారు.
భారతదేశం సంవత్సరాలుగా మూడు కోవిడ్-19 తరంగాలను చూసింది, ఏప్రిల్-జూన్ 2021లో డెల్టా వేవ్ సమయంలో అత్యధిక రోజువారీ కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. మే 7, 2021న, 414,188 కొత్త కరోనా కేసులునమోదవ్వగా, 3,915 మంది మృతి చెందారు.
మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. అంతేకాదు దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
