సాక్షి లైఫ్ : ప్రజెంట్ స్మార్ట్ఫోన్ల యుగంలో పిల్లలు ఆటపాటలకు దూరమై గంటల కొద్దీ స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో, 'జాతీయ వ్యాయామ దినోత్సవం' (National Exercise Day) పురస్కరించుకుని వైద్యనిపుణులు పిల్లల్లో చిన్నతనం నుంచే వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చాలని చెబుతున్నారు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
రోజూ 30 నిమిషాలు చాలు..
పిల్లలు జిమ్లకు వెళ్లి భారీ కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు చురుకైన శారీరక శ్రమ ఉంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్కూలుకు వెళ్లేటప్పుడు లేదా సాయంత్రం వేళల్లో నడక, సైక్లింగ్ వంటివి అలవాటు చేయాలి. డ్యాన్స్, యోగా లేదా నచ్చిన క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వ్యాయామం అనేది ఒక శిక్షలా కాకుండా, వినోదభరితంగా ఉండాలి.
ప్రయోజనాలు అనేకం..
చిన్నతనం నుంచే చురుగ్గా ఉండటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన బరువును నిర్వహించడం సులభమవుతుంది. వ్యాయామం చేసే పిల్లల్లో ఒత్తిడి తగ్గి, మూడ్ ఉత్సాహంగా ఉంటుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
క్రమం తప్పకుండా ఆటలు ఆడే పిల్లలు చదువులోనూ మెరుగైన ఏకాగ్రతను ప్రదర్శిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. పిల్లలను కేవలం వ్యాయామం చేయమని చెప్పడం కంటే, వారితో కలిసి నడకకు వెళ్లడం లేదా ఆడుకోవడం వల్ల వారు త్వరగా ప్రభావితమవుతారు. వ్యాయామం అనేది కేవలం క్రీడలకో లేదా జిమ్లకో పరిమితం కాదు. ప్రతి రోజూ చేసే చిన్న చిన్న పనుల్లో కూడా కదలికను పెంచడమే అసలైన ఆరోగ్యం.
ఆరోగ్యకరమైన మార్పులు..
పిల్లల శారీరక దృఢత్వం కోసం పెద్దలు కొన్ని కీలకమైన మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో మొబైల్, టీవీ వంటి సాధనాల వల్ల పిల్లలు శారీరక శ్రమకు దూరమవుతున్నారు, కాబట్టి వారి స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ఎంతో అవసరం.
అలాగే, ప్రతి చిన్న పనికి వాహనాలపై ఆధారపడకుండా, దగ్గరి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చురుకైన నడకను అలవాటు చేయడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపవచ్చు. ఇక విద్యార్థుల విషయానికొస్తే, గంటల తరబడి ఒకేచోట కూర్చుని చదవడం వల్ల అలసట వచ్చే అవకాశం ఉంది. అందుకే చదువు మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకుంటూ, గంటకోసారి కాసేపు అటు ఇటు నడవడం లేదా చిన్నపాటి కదలికలు చేయడం వల్ల మెదడు చురుగ్గా మారి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన పునాదులు వేస్తాయి.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com