శరీరంలో ఈ పోషకం లోపిస్తే ఏం జరుగుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు మెగ్నీషియం ముఖ్యమైంది. దీని లోపం అనేక సమస్యలకు కారణం కావచ్చు. మెగ్నీషియం లోపం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మైగ్రేన్, డిప్రెషన్‌తో సహా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దాని లోపాన్ని అధిగమించడానికి, మీరు మీ ఆహారంలో గుమ్మడి గింజలు, చియా గింజలు, బచ్చలికూర, బాదం, అవకాడో వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

మెగ్నీషియం లోపిస్తే ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి..?

శరీరంలో మెగ్నీషియం లోపాన్ని గుర్తించడం, దానిని భర్తీ చేయడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన పోషక లోపాన్ని వివిధ మార్గాల్లో గుర్తించవచ్చు. అవేంటంటే..? 

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే  ఆకలి అనిపించదు, వికారం, వాంతులు, అలసట, కండరాల తిమ్మిరి లేదా వణుకు,హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు, కొన్నిసందర్భాల్లో మూర్ఛలు వంటివి కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉండాలంటే మెగ్నీషియం ఎంత ముఖ్యమో తెలుసా..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.