Stomach Burning and Acidity : కడుపులో మంట, ఎసిడిటీ వేధిస్తున్నాయా..? ఇవి తీసుకోండి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధిక వేడి, మసాలా ఆహారాలు ఎక్కువగా తినడం, ఎక్కువసేపు కడుపు మాడ్చడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం వంటి కారణాల వల్ల చాలామందికి కడుపులో మంట, పుల్లటి తేన్పులు, ఎసిడిటీ, పొట్ట బరువుగా ఉండటం వంటి సమస్యలు ఎదురవు తుంటాయి. ఇలాంటి సమయాల్లో కేవలం మందుల పైనే ఆధారపడకుండా, మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.నీటి శాతం ఎక్కువగా ఉండే కొన్ని తేలికపాటి ఆహారాలు జీర్ణవ్య వస్థను శాంతపరిచి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. కడుపులో మంటను తగ్గించే ఆ ఐదు సహజసిద్ధమైన ఆహారాలు ఏమిటో చూద్దాం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

కడుపులో మంటను తగ్గించే 5 ఆహారాలు..  

కొబ్బరి నీళ్లు (Coconut Water).. శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే నీరు, ఎలక్ట్రోలైట్స్ కోల్పోయిన ద్రవాలను తిరిగి అందిస్తాయి. అయితే, మధుమేహం లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా తీసుకోవాలి.

కీరదోస (Cucumber)..కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. భోజనంతో పాటు సలాడ్ రూపంలో దీన్ని తీసుకోవచ్చు. అయితే, పచ్చి కీరదోస తింటే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య వచ్చే వారు దీని వాడకాన్ని కొద్దిగా తగ్గించుకోవడం మంచిది.

పుచ్చకాయ (Watermelon).. వేసవిలో శరీరానికి చలువ చేయడంలో పుచ్చకాయది ప్రత్యేక స్థానం. సహజమైన తీపితో పాటు ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. మధుమేహం ఉన్నవారు కార్బోహైడ్రేట్ల స్థాయిలను దృష్టిలో ఉంచుకుని, దీనిని మితంగా స్నాక్‌లా తీసుకోవచ్చు.

సోంపు (Fennel Seeds)..భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలను నమలడం మన భారతీయ సంప్రదాయం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. సోంపు నానబెట్టిన నీటిని కూడా తాగొచ్చు.

మజ్జిగ (Buttermilk)..వేడి వాతావరణంలో మజ్జిగ ఒక అద్భుతమైన పానీయం. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి లేదా పుదీనా ఆకులు కలుపుకుని తాగితే రుచితో పాటు కడుపులో చాలా హాయిగా ఉంటుంది. పాలు, పెరుగు పడని వారు (Dairy intolerance) దీనికి దూరంగా ఉండటం మేలు.

ఇవి కూడా గుర్తుంచుకోండి..

కడుపులో మంటగా అనిపించిన ప్రతిసారీ కేవలం చల్లటి పదార్థాలు తీసుకుంటే సరిపోదు. అసలు కారణమైన అధిక మసాలాలు, వేయించిన, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆహారాన్ని ఎప్పుడూ నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. రోజువారీగా తగినన్ని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. రాత్రి నిద్రపోయే ముందు కడుపు నిండా, అతిగా తినడం మానుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. తరచుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, రక్తస్రావం లేదా ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.