మంచూరియా, పీచు మిఠాయిల అమ్మకాలపై నిషేధం..
సాక్షిలైఫ్ : కాలీఫ్లవర్ (గోబీ)మంచూరియా, (కాటన్ క్యాండీ)పీచు మిఠాయిల అమ్మకాలను నిషేధించింది కర్ణాటక సర్కారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత ,నాణ్యత విభాగం 'కాలీఫ్లవర్ మంచూరియా, పీచు మిఠాయిల నమూనాలను ప్రయోగశాలలలో పరీక్షించింది. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా 'కాలీ ఫ్లవర్ మంచూరియా' తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులు వాడకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశించారు.
పీచు మిఠాయి, మంచూరియా తయారీలో వాడే ఆర్టిఫీషియల్ కలర్స్ ను కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు పీచు మిఠాయి, మంచూరియా విక్రయాలను కూడా నిషేధించినట్లు కర్ణాటక వైద్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు.
107శాంపిల్స్లో..
ప్రజలు, మీడియా నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మంచూరియా, ,పీచు మిఠాయిలో ఉన్న కృత్రిమ రంగుల నమూనాలను రాష్ట్రవ్యాప్తంగా సేకరించి రాష్ట్ర ప్రయోగశాలలలో పరీక్షించారు. 171 మంచూరియా శాంపిళ్లను సేకరించామని, అందులో 107 శాంపిల్స్లో అసురక్షిత కృత్రిమ రంగులున్నాయని మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
15 సురక్షితంగా లేవు..
మొత్తం 25 పీచు మిఠాయి నమూనాలలో 15 సురక్షితంగా లేవని తేలింది. దీనితో పాటు, ఆహార పదార్థాలలో టార్ట్రాజైన్, కార్మోయిసిన్, రోడమైన్ బి వంటి రసాయనాలతో తయారైన కృత్రిమ రంగులు ఉండటం వల్ల, వీటిని నమూనాలలో ఉపయోగించినట్లు ఆయన చెప్పారు.
ఆహారంలో కృత్రిమ రంగులను ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందువల్ల ప్రజలు ఆహారంలో కృత్రిమ రంగులు వాడవద్దని, అస్సలు వాటిని ఉపయోగించవద్దని సూచించింది. ఎలాంటి కలర్స్ లేకుండా తయారుచేసిన మంచూరియా అమ్మకాలు జరపవచ్చని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం..
ఆహార భద్రత,ప్రమాణాల చట్టం, 2006 మార్గదర్శకాలు 3(1) ప్రకారం కృత్రిమ రంగులు సురక్షితం కాదు. ఆహార భద్రత , ప్రమాణాల నిబంధనలు, 2011లోని రూల్ 16.0 ప్రకారం మంచూరియా తయారీలో ఎలాంటి కృత్రిమ రంగులను ఉపయోగించకూడదు. అలాగే పీచు మిఠాయి తయారీలో కూడా ఎలాంటి ఆర్టిఫీషియల్ కలర్స్ వాడకూడదు.
ఇది కూడా చదవండి.. బ్లూ టీ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
