KIDS health : చిన్నారుల్లో సైలెంట్ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ తో తీవ్ర ముప్పు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా ఎండాకాలంలోనే డీహైడ్రేషన్ బారిన పడతామని మనమంతా భావిస్తాం. కానీ, అసలు ముప్పు చలికాలంలోనే పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో ‘సైలెంట్ డీహైడ్రేషన్’ వల్ల వారి చదువు, ఏకాగ్రత దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అందరూ తప్పకుండ తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి..Mobile Phone : మొబైల్ ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రించడం ప్రమాదకరమా..? ఎందుకు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

శరీరం నీటిని కోల్పోతుంది..

చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల పిల్లలకు దాహం తక్కువగా అనిపిస్తుంది. దీనినే వైద్య భాషలో ‘తక్కువ దాహం సంకేతాలు’ (reduced thirst signals) అంటారు. శరీరానికి నీరు అవసరమైనా మెదడు ఆ సంకేతాలను సరిగ్గా పంపదు. దీనికి తోడు చలి నుంచి రక్షణ కోసం వేసుకునే స్వెటర్లు, మందపాటి దుస్తుల వల్ల లోలోపల చెమట పట్టి శరీరం నీటిని కోల్పోతుంది. దీనిని గుర్తించకపోవడమే ‘సైలెంట్ డీహైడ్రేషన్’. మెదడులో సుమారు 73శాతం వరకు నీరు ఉంటుంది.

శరీరంలో ఉండాల్సిన నీటి శాతంలో కేవలం 1శాతం నుంచి 2శాతం తగ్గినా అది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తరగతి గదిలో పాఠాలు వినేటప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు. ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, గుర్తుంచుకోవడంలో మెదడు నెమ్మదిస్తుంది.

కారణం లేకుండానే పిల్లల్లో కోపం రావడం, నీరసంగా ఉండటం డీహైడ్రేషన్ కు సంబంధించిన లక్షణాలే. పిల్లలు తమకు దాహంగా ఉందని చెప్పకపోయినా, కొన్ని లక్షణాలను బట్టి ఆయా సంకేతాలను సులువుగా గుర్తించవచ్చు. పెదవులు ఆరిపోవడం, చర్మం పొడిబారడం. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం. తరచూ తలనొప్పి వస్తోందని చెప్పడం.స్కూలు నుంచి రాగానే విపరీతమైన అలసట చూపడం. చల్లని నీరు తాగడానికి పిల్లలు ఇష్టపడరు.

వాటర్ బాటిల్స్‌లో..

కాబట్టి వాటర్ బాటిల్స్‌లో గోరువెచ్చని నీటిని పంపండి. కేవలం నీరే కాకుండా సూప్‌లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ రూపంలో ద్రవాలను అందించాలి. కీరదోస, నారింజ, యాపిల్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను స్నాక్స్‌గా ఇవ్వాలి. స్కూల్ ల్లోప్రతి పీరియడ్ అయిన తర్వాత లేదా గంటకు ఒకసారి రెండు గుక్కల నీరు తాగమని పిల్లలకు అలవాటు చేయాలి. శీతాకాలంలో పిల్లల మార్కులు తగ్గినా, వారు చదువులో వెనుకబడినా అది కేవలం వారి నిర్లక్ష్యం కాకపోవచ్చు.. వారి శరీరానికి అందుతున్న నీరు సరిపోకపోవడం కూడా కావచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.