సాక్షి లైఫ్ : ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మీకు తెలుసా..? అవును.. పొద్దున్నే ఉప్పు నీళ్లు తాగే అలవాటు బరువు తగ్గడంతోపాటు జలుబు, దగ్గు వరకు అనేక సమస్యలను పరిష్కారించడంలో సహాయపడుతుందట.. ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు తాగే అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిగణిస్తారు.
అయితే ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా? అవును, ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. పొద్దున్నే ఉప్పునీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి వివరంగా తెలుసుకుందాం..
బరువు తగ్గడంలో..
ఉప్పునీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ సులభతరం అవుతుంది. నిజానికి, ఉప్పులో ఉండే ఖనిజాలు శరీర జీవక్రియను పెంచుతాయి. తద్వారా కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం అవుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది ఉప్పునీరు.
తద్వారా శరీరంలో ఉండే అదనపు నీటిని తొలగిస్తుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. దీనితో పాటు, ఉప్పు నీరు ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. అయితే మితంగా తీసుకోవడం వల్లే ఉప్పునీటితో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com