సాక్షి లైఫ్: దేశ రాజధాని ఢిల్లీ(national capital Delhi)ని వాయు కాలుష్యం(Air Pollution) మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెమ్మదిగా వీచే గాలుల కారణంగా కాలుష్య కారకాలు నగరంపై దట్టంగా పేరుకుపోయి, ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం వరుసగా మూడో రోజు కూడా ఢిల్లీ గాలి నాణ్యత (AQI) 'చాలా తక్కువ' కేటగిరీలోనే నమోదైంది. ఏక్యూఐ 353.. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ORS : నకిలీ ORS ప్యాకెట్లను ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు Central Pollution Control Board (CPCB) విడుదల చేసిన గాలి నాణ్యత (AQI)బులెటిన్ ప్రకారం, బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో 24 గంటల సగటు AQI 353గా నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక కాలుష్య స్థాయి ఇదే కావడం ఆందోళనకరం. సోమవారం 345, మంగళవారం 351గా ఏక్యూఐ నమోదు కాగా, బుధవారం మరింత పెరిగింది.
పెరుగుతున్న సాంద్రతబుధవారం అంతా నగరాన్ని తేలికపాటి పొగమంచు లేదా పొగమంచు కప్పేసింది. గాలి వేగం గంటకు ఏడు కిలోమీటర్లకు మించకపోవడంతో కాలుష్య కారకాలు ఒకేచోట పేరుకుపోయి సాంద్రతను పెంచాయి. వాతావరణ శాఖ (Meteorological Department) సీనియర్ శాస్త్రవేత్త (senior scientist)కృష్ణ మిశ్రా మాట్లాడుతూ, గాలి దిశ తూర్పు నుండి పడమరకు మారినప్పటికీ, వేగం తక్కువగానే ఉందని, రాత్రి సమయాల్లో గాలులు ప్రశాంతంగా ఉంటున్నాయని తెలిపారు.
శనివారం వరకు అదే పరిస్థితి..కేంద్ర ప్రభుత్వ వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (EWS) అంచనాల ప్రకారం, ఢిల్లీ AQI శనివారం వరకు "చాలా దారుణమైన స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా పరిస్థితి కొద్దిరోజుల పాటు మెరుగుపడే అవకాశం లేదని హెచ్చరించింది. గాలి నాణ్యత సూచిక 300 పైన నమోదైతే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. ఉదయం పూట, ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఆరుబయట వ్యాయామం లేదా తిరగడం తగ్గించాలి. దగ్గు, కళ్ల మంటలు, గొంతు నొప్పి వంటి సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాలు (బుధవారం సాయంత్రం 4 గంటలకు) ఏరియాAQIనెహ్రూ నగర్ 411 (తీవ్రమైన స్థాయి) పంజాబీ బాగ్406 (తీవ్రమైన) వజీర్పూర్406 (తీవ్రమైన)లోధి రోడ్230 (పూర్)IGI విమానాశ్రయం294 (పూర్) బుధవారం సాయంత్రం 4 గంటలకు మొత్తం 39 క్రియాశీల మానిటరింగ్ స్టేషన్లలో, మూడు స్టేషన్లలో "తీవ్రమైన" కాలుష్య స్థాయిలు, 33 స్టేషన్లలో "చాలా తక్కువ" కేటగిరిలో కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com