సాక్షి లైఫ్ : పిల్లల్లో పోషకాహార లోపం, మహిళల్లో రక్తహీనతను తగ్గించే లక్ష్యంతో అమలు చేస్తున్న టేక్-హోమ్ రేషన్లు (టి హెచ్ ఆర్) అండ్ హాట్ కుక్డ్ మీల్స్ (హెచ్ సిఎం) లో శుద్ధి చేసిన చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్లు, రంగులు, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ ను తగ్గించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సమర్పించిన సాంకేతిక నివేదిక ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆందోళన..
దేశంలోని పలు రాష్ట్రాల్లో లబ్ధిదారులకు అందిస్తున్న టేక్-హోమ్ రేషన్లు, హాట్ కుక్డ్ మీల్స్లో శుద్ధి చేసిన చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్లు అధిక మొత్తంలో ఉన్నట్లు ఇటీవల జరిపిన విశ్లేషణలో వెల్లడైందని కేంద్ర మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇది సరైన పోషకాహారం అందించే ఉద్దేశ్యానికి విరుద్ధమని అభిప్రాయపడింది.