సాక్షి లైఫ్ : మనుషులు క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోతున్నారు. ఎంత బిజీగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి పెరుగుతున్నాయి. కనీసం ప్రశాంతంగా కూర్చుని తినడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఈ బిజీ లైఫ్ వల్ల మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నామని సైకాలజిస్టులు చెబుతున్నారు.