ఏహెచ్ఏ గుడ్‌న్యూస్: కొత్త గైడ్‌లైన్స్‌తో మధుమేహ రోగులకు గుండె భద్రం..!

సాక్షి లైఫ్ : మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే, ఈ ముప్పును తగ్గించడంలో రక్తపోటు నియంత్రణ అత్యంత కీలకమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఇటీవల విడుదల చేసిన సవరించిన మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త సూచనలను అనుసరిస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ గుండెను మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

 
మధుమేహానికి, అధిక రక్తపోటుకు ఉన్న సంబంధం ఏమిటి..?

సాధారణంగా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే, అది రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం రెండూ కలిసి గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యల వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున, ఒకదాన్ని నియంత్రించడం ద్వారా మరొకదాన్ని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ)కొత్త మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి..?

ఏహెచ్ఏ తాజా మార్గదర్శకాల ప్రకారం, మధుమేహ రోగులు తమ రక్తపోటును గతంలో ఉన్న 140/90 mmHg బదులుగా 130/80 mmHg లేదా అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక కఠినమైన లక్ష్యంలా కనిపించినప్పటికీ, దీనిని సాధించడం ద్వారా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే మధుమేహం, అధిక రక్తపోటు రెండూ కలిసి గుండె ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువులని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త లక్ష్యం కేవలం రక్తపోటును నియంత్రించడమే కాకుండా, మొత్తం కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


అందుకోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏం చేయాలి..?

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సూచనలను పాటించాలి.. 

ఔషధాలు: వైద్యుడి సలహా మేరకు సరైన రక్తపోటు మందులను క్రమం తప్పకుండా వాడటం.

ఆహార నియమాలు: ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

బరువు: ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఊబకాయం రక్తపోటును పెంచుతుంది.

మానసిక ఒత్తిడి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఈ కొత్త మార్గదర్శకాలను పాటించడం ద్వారా, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ గుండెను, కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes heart-attack heart-risk heart heart-health heart-blocks heart-problems heart-problems-cardiologist heart-related-problems heart-disease heart-diseases america heart-failure new-guidelines health-guidelines
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com