దంత సమస్యలు.. వాస్తవాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఓరల్ ప్రాబ్లమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారని గ్లోబల్ ఓరల్ హెల్త్ స్టేటస్ రిపోర్ట్ లో వెల్లడైంది. ముఖ్యంగా వెనుకబడిన దేశాల్లో నలుగురిలో ముగ్గురు దంత సంబంధిత సమస్యల బారీన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లమంది ప్రజలు దంతాల క్షయంతో ఇబ్బంది పడుతున్నారు. 51.4 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక దంత క్షయంతో బాధపడుతున్నట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

 

ఇది కూడా చదవండి..ఐస్ట్రోక్ అంటే ఏమిటి..? కారణాలు, లక్షణాలు, చికిత్స..?

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

శరీరానికి కావలసిన శక్తి చక్కగా అందాలంటే దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇదేంటి శరీరానికి శక్తి అందడానికి, పండ్లకు సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా..? ఔను దంతాలు మంచిగా ఉంటేనే కదా ఆహారాన్ని చక్కగా నమిలి మింగగలిగేది. బాగా నమిలినప్పుడే కదా..? ఆహారం జీర్ణమవ్వడానికి సిద్ధమయ్యేది. 

అలా ఆహారం జీర్ణమైనప్పుడే కదా శక్తి విడుదలయ్యేది. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండి దైనందిన కార్యక్రమాలను నిర్వర్తించగలుగుతాం. కాబట్టి దంతాలను మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. చర్మ సంరక్షణ కోసం చేయాల్సినవి .. చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం..! 

 అవగాహన అవసరం.. 

చూడటానికి, తెల్లగా, గట్టిగా ఉండే దంతాలను సంరక్షించుకుంటేనే అవి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాయి. వీటి సంరక్షణ ఆవశ్యకత అర్థం కావాలంటే ముందు వాటి నిర్మాణంపై అవగాహన అవసరం. దంతంపై భాగం ఎనామిల్‌ అనే పదార్థంతో ఏర్పడుతుంది. ఎనామిల్‌ తర్వాత డెంటిన్‌ అనే మరో పొర ఉంటుంది. డెంటిన్‌ తరువాత పల్ప్‌ కనిపిస్తుంది. 

చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే..?
 
ప్రతి దంతానికి దవడలో మూలం ఉంటుంది. ఎన్ని పండ్లుంటే అన్ని మూలాలు దవడ ఎముకలో ఉంటాయి. ఈ దంతాల చుట్టూ చిగురు ఆవరించి ఉండి సిమెంట్‌ లాగా పనిచేస్తుంది. చిగుళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే దంతాలు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే వాచిపోయి దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

చిగుళ్ల వాపు వల్ల.. 

ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు మన నోటి నుంచి భరించలేని వాసన వస్తుంది. ఫలితంగా చాలామంది మనల్ని తప్పించుకుని తిరిగే ప్రమాదమూ ఉంటుంది. చిగుళ్ల వాపువల్ల రక్తస్రావం కూడా కలుగుతుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దంతాలు కదలడం ప్రారంభమవుతుంది.

 ఏదైనా తిన్న తర్వాత.. 
 
దంతాలు వచ్చినా, రాకపోయినా శిశువులు పాలు తాగిన తర్వాత నోరంతా శభ్రంగా కడగాలి. వేలితో చిగుళ్లను మర్దన చేయాలి. పాల సీసా పీకను నోట్లోనే ఉంచి నిద్రపుచ్చకూడదు. ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించి ఊయడం, నోటిని శుభ్రం గా కడుక్కోవడం వంటి పనులను పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలకు శాస్త్రీయంగా ఎలా పండ్లు తోమాలో తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించాలి.

 ప్రతి మూడు నెలలకోసారి.. 

 కిందిపండ్లు పైకి, పై పండ్లు కిందికి బ్రష్‌ చేయాలి. పెద్దలు వాళ్ళు కూడా బ్రష్‌ని ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి. పంటి నొప్పి లేదా చిగురు వాపు వస్తే దంతానికి జందూబామ్‌ లేదా అమృతాంజన్‌ వంటివి రాయకూడదు. పంటి సందుల్లో పుల్లలు, పిన్సీసులు వంటివి పెట్టి కెలకకూడదు. పాన్‌, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నమలకూడదు.

 గరుకైన పొడులను, గట్టిగా ఉండే బ్రష్‌లను దంతాలు శుభ్రంచేయడానికి ఉపయోగించకూడదు. అతి చల్లగా కానీ లేదా అతి వేడిగా ఉండే పదార్థాలను, పానీయాలను పంటికి తగలకుండా జాగ్రత్తపడితే మంచిది. దంతాలకు వైద్యం చేయించు కుంటే చూపు మందగి స్తుందని చాలామంది అనుకుంటారు. 

పంటి నరాలకు, కంటి నరాలకు.. 

ఇది పెద్ద అపోహ.. పంటి నరాలకు, కంటి నరాలకు సంబంధమే లేదు. దంతాలు పుచ్చిపోవడానికి పురుగులు కారణం అనుకుంటారు. అది కూడా తప్పే. దంతాలు పుచ్చిపోవడానికి అసలు కారణం సూక్షజీవులు.

 నోటి దుర్వాసన.. 

దంతాలను, చిగుళ్లను అన్ని వైపులా శుభ్రంచేసుకోక పోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మనం తిన్న ఆహారం పండ్లలో ఇరుక్కుపోయి కుళ్లిపోయి దంత సమస్యలు వస్తాయి. అందుకే చిగుళ్లు వాయడం, రక్తంకారడం జరుగుతుంది. 

పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య.. 

పళ్లు పుచ్చిపోవడం మరో సమస్య. దంతాల పుచ్చు ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రమాదం. కాబట్టి దంత సంరక్షణలో అవసరమైన జాగ్రత్తలు పాటించి ఆగ్యంగా ఉండండాలని డెంటిస్టులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.