Diabetes Care : మధుమేహం ఉన్నవారు ఈ 5 పండ్లకు దూరంగా ఉండటం మేలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం (Diabetes) ఉన్నవారు కేవలం తీపి పదార్థాలు మానేస్తే సరిపోదు, తాము తీసుకునే పండ్ల విషయంలోనూ సరైన ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ, కొన్నింటిలో సహజ చక్కెర (fructose), కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (blood sugar levels) అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.

పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండే పండ్లను చాలా జాగ్రత్తగా, మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లు మితంగా తినాలో, వేటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

మధుమేహ బాధితులు పరిమితంగా తీసుకోవాల్సిన 5 పండ్లు ఇవే..  

1. బాగా పండిన అరటిపండు (Ripe Banana)..  

అరటిపండు తక్షణ శక్తిని ఇస్తుంది, కానీ బాగా పండిన అరటిపండులో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్ల శాతం అధికంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ లోడ్ కూడా ఎక్కువే కావడంతో రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. ఒకవేళ డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తినాలనుకుంటే, సగం లేదా చిన్న పండును మాత్రమే తీసుకోవాలి. దాన్ని కూడా నట్స్ లేదా ప్రోటీన్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవడం ఉత్తమం.

2. మామిడి పండు (Mango).. 

పండ్ల రారాజుగా పిలిచే మామిడి పండులో కూడా సహజ చక్కెరలు చాలా ఎక్కువే. దీనిని ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు మామిడిపండు తినాలనుకుంటే వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు చాలా తక్కువ పరిమాణంలో అంటే ఒకటి లేదా రెండు ముక్కలు మాత్రమే తీసుకోవాలి.

3. ద్రాక్ష (Grapes)..  

ద్రాక్ష పండ్లు చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటిలో చక్కెర శాతం ఎక్కువే. ఒకేసారి ఎక్కువ ద్రాక్ష పండ్లు తింటే శరీరంలో గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి మధుమేహ బాధితులు ద్రాక్ష పండ్ల పరిమాణాన్ని కచ్చితంగా నియంత్రించుకోవాలి.

4. సపోటా ( Sapota)..  

సపోటా చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో సహజ చక్కెరతో పాటు కేలరీలు కూడా ఎక్కువే. దీన్ని ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీలైనంత వరకు సపోటాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే మాత్రం చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

5. లీచీ (Lychee)..  

లీచీ పండ్లు రుచిగా, రసభరితంగా ఉంటాయి. అయితే వీటిలోనూ సహజ చక్కెరలు మోతాదుకు మించే ఉంటాయి. లీచీ పండ్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ పేషెంట్లు వీటిని మితంగానే తీసుకోవాలి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకూడదు. మధుమేహం ఉన్నవారు పండ్లను జ్యూస్‌ల రూపంలో కాకుండా, ముక్కలు నమిలి తినడం మంచిది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.