కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇటీవల కొన్నిఆహారపదార్థాల కల్తీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హాంగ్ కాంగ్ లో భారతదేశానికి చెందిన పలు మసాలా దినుసుల పొడి తయారు చేసే సంస్థల ఉత్పత్తులపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రజలు తీసుకునే ఆహార పాదార్థాలకు భద్రత లేకుండా పోయింది. సురక్షితమైన ఆహారపదార్థాల గురించి ప్రజలకు అవగాహన చాలా అవసరం. కాబట్టి ఈ సందర్భంగా కల్తీ ఆహారాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.


 కల్తీ ఆహారం.. 

ఈ రోజుల్లో మార్కెట్‌లో అనేక ఆహార పదార్థాలు పండ్లు, ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పాలు వంటివి విపరీతంగా కల్తీ జరుగుతోంది. వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం,వాటి నిరంతర వినియోగం వాంతులు, విరేచనాలు, కాలేయం,మూత్రపిండాలతో సహా కడుపు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే ఒరిజినల్ ఏవి..? కల్తీవి ఏవి..? అనేవి గుర్తించాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 


 ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 


పాలను నీటితో కల్తీ చేయడమే కాకుండా, దానిని చిక్కగా చేయడానికి  దాని పరిమాణాన్ని పెంచడానికి డిటర్జెంట్లు, సింథటిక్ పాలు కూడా కలుపుతారు. కాబట్టి దానిని గుర్తించడానికి, 1/2 కప్పు పాలను 1/2 కప్పు నీటితో కలపండి. అందులో నురుగు వస్తే అది డిటర్జెంట్ కలిపిన పాలు  అని గుర్తించాలి. సింథటిక్ పాలను గుర్తించడానికి, పాలను వేళ్ల మధ్య రుద్దినప్పుడు, అది సబ్బులా అనిపిస్తుంది.

పసుపు.. 

ఒక గ్లాసు నీరు తీసుకోండి. నీటిలో కొంచెం పసుపు కలపండి. పసుపు కల్తీ అయితే నీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది. పసుపు గ్లాసు కిందికి వెళుతుంది. కల్తీ పసుపు ఉన్న నీరు మరింత పసుపు రంగులో కనిపిస్తుంది.

పండ్ల విషయంలో.. 

చాలా వరకు కల్తీ పండ్లు, కూరగాయలలో ముఖ్యంగా ఆపిల్స్ లో జరుగుతుంది. మరింత మెరిసేలా చేయడానికి, దానిపై మైనపు పొర ను అప్లై చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలంటే..? యాపిల్‌ పైన కత్తితో తేలికగా గీయండి. అప్పుడు మైనపు పొర ఉందో లేదో సులువుగా తెలుస్తుంది. 

 మిరియాలు..  

 మిరియాల్లో కూడా బొప్పాయి గింజలు కలిపి కల్తీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని పరీక్షించడానికి, ఒక గ్లాసులో నీటిని తీసుకుని, అందులో  మిరియాలు వేయండి. మూడు నాలుగు నిమిషాల తర్వాత అందులో బొప్పాయి గింజలు ఉంటే నీటిపై తేలి కనిపిస్తాయి.

నెయ్యి.. 

బంగాళదుంప, శుద్ధి చేసిన నూనెను దేశీ నెయ్యిలో కలపడం ద్వారా కల్తీకి పాల్పడుతున్నారు. ఐతే దానిని గుర్తించడానికి, నెయ్యిలో కొద్దిగా అయోడిన్ ద్రావణాన్ని కలపండి. దాని రంగు నీలం రంగులోకి మారితే, నెయ్యిలో పిండి పదార్ధం కలపినట్లు గుర్తించాలి. 

ఒరిజినల్ ఎర్ర మిరపకాయపొడిని గుర్తించడానికి, మిరప పొడిని నీటిలో వేయండి. ఒకవేళ ఎర్ర మిరప పొడి నీటిలో తేలితే అది స్వచ్ఛమైనది. మునిగిపోతే అది కల్తీ అయినట్లు గుర్తించాలి. 

ఇది కూడా చదవండి.. నాలుక శుభ్రం చేసుకోకపోతే ఏమౌతుంది..?  

ఇంగువ..? 

నెయ్యి లేదా నూనె కలిపినప్పుడు నకిలీ ఇంగువ రంగు లేత ఎరుపు రంగులోకి మారకపోతే, అది నకిలీ. రెండవది, నిజమైన ఇంగువను కాల్చినప్పుడు, అది సులభంగా మంటలను అంటుకుంటుంది, అయితే కల్తీ ఇంగువ త్వరగా మంటలను అంటుకోదు.

తేనె..  

నీటి సహాయంతో తేనె నిజమైనదా..? నకిలీ దా..? అనేది గుర్తించవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె కలపండి. అది నీటిలో కిందికి చేరితే అది స్వచ్ఛమైనది. అలా కాకుండా నీటిలో కరిగితే అది నకిలీ. తేనెను వైట్ కలర్ క్లాత్ పై వేస్తె అది పీల్చుకోదు. అంతేకాదు దానిపై మ‌ర‌క‌లు కూడా అంటవు. ఒకవేళ న‌కిలీ తేనె ఐతే మ‌ర‌క‌లు అవుతాయి. క్లాత్ లోప‌లికి పీల్చుకుంటుంది.

ఇది కూడా చదవండి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.