మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినొచ్చా..?  

సాక్షి లైఫ్ : కొన్నిరకాల వ్యాధులున్నవాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అయితే ఆచి తూచి తీసుకోవాల్సి ఉంటుంది. మామిడి పండు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా..? తింటే ఎంత మోతాదులో తినొచ్చు..?  దీని గురించి వైద్యనిపుణులు ఏమంటున్నారు..? 

ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?   

 డయాబెటిక్ రోగులు తీపి పదార్థాలను నివారించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.  షుగర్ ఉన్నవాళ్లు తీసుకోకూడని వాటిలో స్వీట్లు, శీతల పానీయాలు, కేకులు, పేస్ట్రీలు కాకుండా, ఇందులో కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి మామిడిపండు. డయాబెటిక్ పేషెంట్లకు మామిడిపండు తినడం మంచిదా కాదా అనే విషయంలో ప్రజల్లో చాలా గందరగోళం ఉంది.
 
వేసవిలో లభించే మామిడి పండు ప్రజలకు ఇష్టమైన పండు మాత్రమే కాదు, ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పీచు, విటమిన్లు, మినరల్స్ మామిడిలో పుష్కలంగా ఉంటాయి. అలాగే చక్కెర స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పిండి పదార్థాల స్థాయి తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉన్నవారు మామిడి పండ్లను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. నాలుక శుభ్రం చేసుకోకపోతే ఏమౌతుంది..?  


డయాబెటిక్ పేషెంట్‌లు తమ ఆహారంలో మామిడిపండు చేర్చుకునేటప్పుడు ఎంత మామిడిపండు తినాలనేది ఇంపార్టెంట్.   మామిడిపండును సగం లేదా ఒక కప్పు  ముక్కలు తిన్నా ఫర్వాలేదని, కానీ దీనితో పాటు, రక్తంలో చక్కెర స్థాయిని కూడా తనిఖీ చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. తద్వారా మామిడి పండు తినడం రక్తంలో చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు. మామిడిని ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వుతో తింటే, చక్కెర శోషణను మందగించడం ద్వారా రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 మామిడిలో పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా మామిడి సహాయపడుతుంది. మీరు దీన్ని సరైన పరిమాణంలో తింటే, ఇది చాలా జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. అయితే మధుమేహంతో బాధపడేవారు మామిడిని తక్కువ పరిమాణంలో తినాలని డైటీషన్ల సూచిస్తున్నారు. 

మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) అంటే షుగర్ లెవెల్ 51 ఉంటుంది, అందుకే దీన్ని తినవచ్చు. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల పండ్ల తీపి ఉంటుంది. ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, విటమిన్ ఎ, కె, బి6, బి12 వంటి అనేక పోషకాలు మామిడిలో ఉన్నాయి. మధుమేహ రోగులు అల్పాహారం,మధ్యాహ్న భోజనంలో పరిమిత పరిమాణంలో మామిడిని తినవచ్చు. ఇందులో ఎలాంటి సమస్య లేదు.  

డయాబెటిక్ రోగులు మామిడిని ఆస్వాదించవచ్చు, కానీ దాని పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, షుగర్ ఎక్కువగా ఉండే వారికంటే తక్కువగా ఉండేవారు కొంత మోతాదులో మామిడి పండ్లు తినొచ్చని వైద్య నిపుణులు  అభిప్రాయపడుతున్నారు. 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes healthy-food sugar-levels sugar-problem sugar-patients mango-fruit raw-mango

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com