మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏమిటి?
సాక్షి లైఫ్ : ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ అవేర్నెస్ డే 2024: మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. వ్యాధి గురించి తెలిసిన వారిలో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంగా, మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ మల్టిపుల్ స్క్లెరోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
వ్యాధి గురించి తెలియదు..
చాలా మందికి వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చినా చాలా ఆలస్యం గుర్తిస్తున్నారు. ఎందుకంటే ..? ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక.. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా మెదడు, వెన్నుపాముపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రపంచవ్యాప్తంగా 2.3 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అసలు ఏంటి ఈ వ్యాధి..?
మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కణాలపై దాడి చేస్తుంది. దీనికారణంగా ఆరోగ్యకరమైన కండరాలు ప్రభావిత మవుతాయి. అంతేకాదు మెదడు, శరీరంలోని ఇతర భాగాలు సరిగ్గా స్పందించవు. ఇది అంతర్లీన అవయవాలకు హాని కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఇంట్లోకి దోమలు రాకుండా చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
