సాక్షి లైఫ్ : తేలికపాటి తలనొప్పి లేదా శరీర నొప్పి వచ్చినప్పుడు చాలా మంది స్వయంగా నొప్పి నివారణ మందులను తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు డాక్టర్ ఫీజులు ఆదా చేసుకునే ప్రయత్నంలో కొందరు కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వైద్యుడిని సంప్రదించకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, శరీరంలోని అనేక ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
నేటి బిజీ జీవితంలో, ప్రజలు తరచుగా శారీరక నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పి లేదా కండరాల ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో, త్వరగా ఉపశమనం పొందడానికి, వైద్యుడిని సంప్రదించకుండానే నొప్పి నివారణ మందులు తీసుకుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైద్యుడి సలహా లేకుండా నొప్పి నివారణ మందులను అనాల్జెసిక్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
కాలేయం-మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం..
పెయిన్ కిల్లర్స్ అధిక పరిమాణంలో తీసుకుంటే, అవి కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి కాలేయం పనిచేస్తుంది. కానీ అధిక మొత్తంలో నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది కాలేయానికి హాని కలిగించవచ్చు. మూత్రపిండాలు శరీరం నుంచి హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తాయి. కానీ నొప్పి నివారణ మందులను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది.
కడుపు సంబంధిత సమస్యలు..
వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీని కారణంగా, కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తతుతాయి. కొన్ని నొప్పి నివారణ మందులు కడుపు పొరను దెబ్బతీస్తాయి, ఇది అంతర్గత రక్తస్రావం కూడా కలిగిస్తుంది.
ఔషధాల ప్రభావం తగ్గడం..
వైద్యుల సలహా లేకుండా పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఈ మందులకు నిరోధకత పెరుగుతుంది. దీని అర్థం కాలక్రమేణా మందుల ప్రభావం తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువ మొత్తంలో మందులు తీసుకోవలసి వస్తుంది. అప్పుడు శరీరంలోని పలు అవయవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com