Menstrual Health Tips : నెలసరి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ఎందుకు ముఖ్యం అంటే..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నెలసరి (periods) అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, ఆ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కడుపు నొప్పి, నడుము నొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఆ  సమయంలో సరైన ఆహార నియమాలు పాటించకపోతే ఆ అసౌకర్యం మరింత ఎక్కువవుతుంది. నెలసరి సమయంలో శరీరాన్ని దృఢంగా ఉంచే, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ప్రత్యేక ఆహార ప్రణాళిక మీ కోసం..

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?   

 

1. రక్తహీనతను అరికట్టే 'ఐరన్' ఆహారాలు..  

నెలసరి సమయంలో రక్తస్రావం కారణంగా శరీరంలో ఇనుము (Iron) లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన నీరసానికి, తలతిరగడానికి దారితీస్తుంది.

తీసుకోవాల్సినవి..

పాలకూర, తోటకూర, మెంతులు వంటి ఆకుకూరలు, బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూరం, ఎండుద్రాక్ష , బెల్లం వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. శనగలు, కాయధాన్యాలు కూడా మంచి ఎంపిక.

 ఇనుమును శరీరం త్వరగా గ్రహించాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు నిమ్మరసం, నారింజ లేదా ఉసిరి వంటి విటమిన్-సి ఎక్కువగా ఉండే పదార్థాలను కలిపి తీసుకోవాలి.

2. నీరసాన్ని తరిమికొట్టే 'ప్రోటీన్'..  

కండరాల తిమ్మిరులు (Cramps) తగ్గడానికి, హార్మోన్ల సమతుల్యతకు, శరీరానికి తక్షణ శక్తి లభించడానికి ప్రోటీన్లు ఎంతో అవసరం.

ఉత్తమ వనరులు.. గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, సోయాబీన్స్, టోఫు, తక్కువ నూనెతో వండిన చికెన్, చేపలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి, అనారోగ్యకరమైన ఆహారాలపైకి మనసు మళ్లకుండా ఉంటుంది.

3. జీర్ణక్రియను మెరుగుపరిచే 'ఫైబర్'..  

నెలసరి సమయంలో చాలా మంది మహిళల్లో మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు కనిపిస్తాయి. నివారణ..పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు,పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా అరటిపండు, ఆపిల్, బొప్పాయి, బెర్రీలు శరీరానికి మేలు చేసే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, కడుపునొప్పి తీవ్రత పెరుగుతుంది. అందువల్ల రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. సాదా నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, హెర్బల్ టీ వంటి ద్రవపదార్థాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి.

4. నెలసరి రోజుల్లో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి..!

కొన్ని రకాల ఆహార అలవాట్లు పీరియడ్స్ నొప్పులను అసౌకర్యాన్ని మరింత పెంచుతాయి. అధిక ఉప్పు, కారం, చిప్స్, పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల శరీరంలో నీరు చేరి (Water Retention) కడుపు ఉబ్బరం ఎక్కువవుతుంది. తీపి పదార్థాలు.. శీతల పానీయాలు, చాక్లెట్లు, స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, ఆ వెంటనే తగ్గించడం వల్ల తీవ్రమైన అలసట, కోపం, చిరాకు వంటి మూడ్ స్వింగ్స్ వస్తాయి.

కెఫిన్ పరిమితం చేయండి.. కాఫీ, టీలను ఎక్కువగా తాగడం వల్ల కండరాల నొప్పులు,గుండెల్లో చంచలత్వం పెరుగుతాయి. నెలసరి సమయంలో జంక్ ఫుడ్‌ తినాలనే కోరిక సహజం. కానీ ఆ సమయంలో ఇంట్లో వండిన వేడివేడి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత విశ్రాంతి పొందడం వల్ల పీరియడ్స్ రోజులను సైతం హాయిగా, ఆరోగ్యంగా దాటవచ్చు.

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.