రెండు నెలల్లో ఎముకలు కొరికే చలికి 474 మంది మృతి..
సాక్షి లైఫ్ : డిసెంబర్ నుంచి జనవరి మధ్య వరకు ఢిల్లీలో ఎముకలు కొరికేంత చలికి 474 మంది నిరాశ్రయులు మరణించారు. ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) గుర్తించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ,పోలీసు కమిషనర్కు నోటీసు జారీ చేసింది. దీనిపై వారంలోపు వివరణాత్మక నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. అనేక షెల్టర్ హోమ్లు తగినంత డిమాండ్ను తీర్చలేక పోతున్నాయని, చాలా చోట్ల నిరాశ్రయులకు అవసరమైన సౌకర్యాలు లేవని కమిషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి.. చలివాతావరణం సోరియాసిస్ లక్షణాలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఈ శీతాకాలంలో ఢిల్లీలో 56 రోజుల్లో దాదాపు 474 మంది ప్రాణాలు కోల్పోయారని నిరాశ్రయుల కోసం పనిచేస్తున్న ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (సిహెచ్ డి) నివేదిక, ఎన్ హెచ్ఆర్సీ నివేదికల లు వెల్లడించాయి. చలిని తట్టుకునేలా దుస్తులు, దుప్పట్లు , తగిన ఆశ్రయంతోపాటు ఇతర సౌకర్యాలు, రక్షణ చర్యలు అందుబాటులో లేకపోవడం వల్ల గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఈ సంవత్సరం జనవరి 10 మధ్య ఈ మరణాలు సంభవించాయి.
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
