సాక్షి లైఫ్ : బీహార్ రాష్ట్రంలో హెచ్ఐవీ (HIV) విజృంభణ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO), రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ కమిటీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 13 జిల్లాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ముప్పులో ఉన్నట్లు గుర్తించారు. ఈ జిల్లాల్లో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ముజఫర్పూర్లోనే అత్యధికం..
పాట్నా ద్వితీయ స్థానం.. హెచ్ఐవీ కేసుల్లో ముజఫర్పూర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2025 గణాంకాల ప్రకారం ఇక్కడ కొత్తగా 1,253 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 9,189 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాజధాని పాట్నా 850 కొత్త కేసులతో రెండో స్థానంలో ఉంది.
హై-రిస్క్ జిల్లాల జాబితాలో..
ముజఫర్పూర్, పాట్నా, బెగుసరాయ్, భాగల్పూర్, దర్భంగా, గయ, గోపాల్గంజ్, తూర్పు చంపారన్, సమస్తిపూర్, సారణ్, సీతామర్హి, సివాన్, వైశాలి ఉన్నాయి.
గణాంకాలు చెబుతున్న వాస్తవాలివే.. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా బాధితుల విభజనను గమనిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
పురుషుల్లో 7,334 మంది,
మహిళల్లో : 2,957 మంది
యువతలో 2,240 మంది
చిన్నారుల్లో 359 మంది చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారిన పడటం విషాదకరం. గత ఏడాది కాలంలో 1,265 మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
హోలీ వేళ ప్రత్యేక తనిఖీలు..
త్వరలో రానున్న హోలీ పండుగను పురస్కరించుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక హెచ్ఐవీ పరీక్షా కేంద్రాలను (Screening Camps) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ కమిటీ డైరెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలితే తక్షణమే వారికి వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
పర్యవేక్షణలో భాగంగా 225 గ్రామీణ ఏఎన్ఎం (ANM) కేంద్రాలు, 9 పట్టణ కేంద్రాలు హెచ్ఐవీ నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయడం లేదని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరిస్తూ, తక్షణమే పర్యవేక్షణ పెంచాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హెచ్ఐవీ అనేది ప్రాణాంతకం కాకపోయినా, సరైన సమయంలో గుర్తిస్తేనే మెరుగైన జీవితాన్ని గడపవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అప్రమత్తతే ఈ మహమ్మారికి అసలైన విరుగుడు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com