Growing Global Concern Over Cancer : క్యాన్సర్ మహమ్మారిపై పెరగుతున్న ఆందోళన..: WHO నివేదికలో విస్తుపోయే నిజాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల తర్వాత అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి 'క్యాన్సర్'. ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), దాని అనుబంధ సంస్థ 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' (IARC) సంయుక్త నివేదిక హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ప్రతి ఐదుగురిలో ఒకరికి ప్రమాదం..!

ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో సగటున ప్రతి ఐదుగురిలో ఒకరు (సుమారు 20% మంది) తమ జీవితకాలంలో ఏదో ఒక దశలో క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే ప్రతి 9 మంది పురుషులలో ఒకరు, ప్రతి 11 మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 2.06 కోట్ల కొత్త కేసులు నమోదవుతుండగా, దాదాపు కోటి మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. అంటే రోజుకు సగటున 26,000 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ వల్ల కన్నుమూస్తున్నారు.

ధనిక, పేద దేశాల మధ్య భారీ వ్యత్యాసాలు..

క్యాన్సర్ నివారణ, సకాలంలో గుర్తింపు, వైద్య సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య కొండంత వ్యత్యాసం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.జీవించే అవకాశాలు..అధిక ఆదాయం ఉన్న దేశాలలో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడిన మహిళల్లో 87 శాతం మంది రోగ నిర్ధారణ తర్వాత ఐదేళ్లకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అదే తక్కువ ఆదాయ దేశాలలో ఈ రేటు కేవలం 42 శాతంగానే ఉంది. మందుల లభ్యత..పేద, దిగువ మధ్యతరగతి దేశాలలో అత్యవసర క్యాన్సర్ మందుల లభ్యత కేవలం 9 నుంచి 54 శాతంగానే ఉండగా, ధనిక దేశాలలో ఇది 68 నుంచి 94 శాతం వరకు ఉంటోంది.

తీవ్ర ఆర్థిక, మానసిక భారం..

క్యాన్సర్ అనేది కేవలం రోగిని మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తాన్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. చికిత్స కోసం చేసే ఖర్చులు మధ్యతరగతి, పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ప్రస్తుతానికి 82 శాతం దేశాల్లో జాతీయ క్యాన్సర్ నియంత్రణ ప్రణాళికలు ఉన్నప్పటికీ, వాటి ప్రయోజనాలు ఆశించిన వేగంతో ప్రజలకు చేరడం లేదు. కేవలం మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్సను తమ 'సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ' (Universal Health Coverage) పరిధిలోకి తెచ్చాయి.

క్యాన్సర్ నియంత్రణను కేవలం ఒక వైద్య సమస్యగా చూడకుండా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా 'సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ'లో భాగం చేయాలని WHO ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. సామాజిక రక్షణను బలోపేతం చేయడం, మందుల ధరలను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాలకూ వైద్య సేవలను విస్తరించడం ద్వారానే ఈ మహమ్మారిపై విజయం సాధించగలమని నివేదిక స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.