ఉగాండాలో 4,342 కు చేరుకున్న ఎంపాక్స్ కేసుల సంఖ్య..  

షేర్ చేయండి:
ఉగాండాలో 4,342 కు చేరుకున్న ఎంపాక్స్ కేసుల సంఖ్య..  

సాక్షి లైఫ్ : ఉగాండాలో ప్రయోగశాలలో నిర్ధారించిన ఎంపాక్స్ కేసుల సంఖ్య 4,342 కు చేరుకుందని, ఎనిమిది నెలల క్రితం తూర్పు ఆఫ్రికాలో ఈ వ్యాప్తి ప్రకటించినప్పటి నుంచి 31 మంది చనిపోయినట్లు ఉగాండా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. గత 24 గంటల్లో మొత్తం 25 కొత్త కేసులు నమోదయ్యాయని, వైరస్ కేంద్రంగా ఉన్న రాజధాని కంపాలాలో 12 కేసులు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ఇది కూడా చదవండి.. ఆయుర్వేదం చికిత్స రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా ఎలా సమతుల్యం చేస్తుంది..?

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ఇతర భాగస్వాముల మద్దతుతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మెరుగైన నిఘా, కేసు నిర్వహణ, ప్రమాద కమ్యూనికేషన్, అవగాహన ప్రచారాలతో సహా నివారణ చర్యలను ముమ్మరం చేసిందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టులో ఎం పాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించింది, ఇది అంతర్జాతీయంగా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి..ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు ప్రమాదకరం ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..ఎబోలా వైరస్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. శాకాహారులకు మెదడు పనితీరును పెంచే ఆహారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి.. అధిక ఒత్తిడితో గుండె జబ్బుల ముప్పు.. 

ఇది కూడా చదవండి..డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.