ప్రపంచ శాఖాహార దినోత్సవం.. చరిత్ర..
సాక్షి లైఫ్ : ప్రపంచ శాఖాహార దినోత్సవం 1977లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ (ఎన్ఏవిఎస్) స్థాపించింది. జార్జియాలోని ఓగ్లేథోర్ప్లో జరిగిన 1976 నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ సభ్యుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. ఇందులో పాల్గొనేవారు శాకాహారులు వారి జీవనశైలిని ప్రోత్సహించడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని భావించారు.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఎన్ఏవిఎస్ ప్రెసిడెంట్ టేలర్ కాల్డ్వెల్ ఈ భావనను ప్రతిపాదించారు. ఇంగ్లాండ్లో శాఖాహార సమాజం (1847) స్థాపనకు అనుగుణంగా అక్టోబర్ 1ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి, ప్రపంచ శాఖాహార దినోత్సవం ఒక ప్రపంచ ఉద్యమంగా అభివృద్ధి చెందింది. మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం ద్వారా జంతు సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం, మానవ ఆరోగ్యంపై అప్పటి నుంచి వర్క్షాప్లు, ప్రచారాలతో ప్రతిఏటా జరుపుకుంటారు.
ప్రపంచ శాఖాహార దినోత్సవం రోజున..
1977లోనార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ ప్రారంభించిన ప్రపంచ శాఖాహార దినోత్సవం రోజున శాఖాహార ప్రయోజనాల గురించి అవగాహనను పెంచుతుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించమని జనాలను ప్రోత్సహిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా శాఖాహార జీవనశైలిని అవలంబించడానికి వ్యక్తులను ప్రేరేపిస్తుంది.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
