ఎన్ఐఎన్ ప్రకారం.. ఏ పాత్రలో ఆహారాన్ని వండాలి..?

షేర్ చేయండి:
ఎన్ఐఎన్ ప్రకారం.. ఏ పాత్రలో ఆహారాన్ని వండాలి..?

సాక్షి లైఫ్ : మట్టి పాత్రలలో ఆహారాన్ని వండడం సురక్షితమైన మార్గమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్) వెల్లడించింది. అవి పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా, తక్కువ నూనెతో వంటలు చేసుకోవచ్చని తెలిపింది. పోషకాలు కూడా తొందరగా పాడవ్వకుండా ఉంటాయని, ఆమ్ల ఆహారాన్ని రాగి, ఇనుము, అల్యూమినియం పాత్రలలో వండకూడదని వివరించింది

 ఇది కూడా చదవండి.. లాలాజల ఉత్పత్తి తగ్గితే  ఏం జరుగుతుంది..?  

స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు.. 

స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు సురక్షితమైనవని ఐసిఎమ్ఆర్-ఎన్ఐఎన్ తెలిపింది. 170 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్-స్టిక్ కుక్‌వేర్‌లో ఆహారాన్ని వండకూడదు. దీనివల్ల పూత దెబ్బతినడమేకాకుండా ఆహారంలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. టెఫ్లాన్ పూత లేని రాతి పాత్రలు, మట్టి పాత్రలు సురక్షితమైనవని తెలిపింది.

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం..

 ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..  

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.