ఫిష్ పెడిక్యూర్ సైడ్ ఎఫెక్ట్స్..
సాక్షి లైఫ్: ఫిష్ పెడిక్యూర్ విషయంలో చిన్న చిన్న చేపలు ఉంచే తొట్టి పరిశుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. చేపలకు వేరే ఆహారం వేయరు. కాబట్టి బాగా ఆకలిగా ఉండడంతో అవి మృతకణాలతోపాటు, సున్నితమైన చర్మాన్ని కూడా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తస్రావం అయ్యి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడవచ్చు. అంతేకాదు సోరియాసిస్, ఎగ్జిమా, హెచ్ఐవి వంటివి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
కొన్నిరకాల చికిత్సలు ఒక్కోసారి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉంటుంది. అటువంటి వాటిలో ఫిష్ పెడిక్యూర్ కూడా ఉంది. అమెరికా, కెనడా, యూరప్ వంటి అనేక దేశాల్లో ఇప్పటికే ఈ చికిత్సను నిషేధించారు. దీని కారణంగా చర్మంపై గాయాలవ్వడమేకాకుండా, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే చేపలను ఉంచే ఆ నీటిని ఎప్పటికప్పుడు మార్చరు. దీనివల్ల మొదట ఫిష్ మెడిక్యూర్ చేయించుకున్న మహిళకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, ఆమె తర్వాత ఫిష్ మెడిక్యూర్ చేయించు కున్న వారందరికీ ఆయా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అంతేకాదు దీనివల్ల కొందరికి తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఎక్కడెక్కడ నిషేధం విధించారంటే..?
14 రాష్ట్రాల్లో చేపల ద్వారా పాదాలకు చేసే చికిత్సలను నిషేధించారు. వీటిలో టెక్సాస్, న్యూయార్క్, కాలిఫోర్నియా,వాషింగ్టన్,మైనే,
మసాచుసెట్స్,మెక్సికో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, కెనడాలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఫిష్ పెడిక్యూర్ ను నిషేధించారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
