భారత్లో కొత్త రకం డయాబెటిస్.. 'టైప్-5'.. ఎలాంటివాళ్లకు వస్తుంది..?
సాక్షి లైఫ్ : భారత్తో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం డయాబెటిస్, అంటే 'టైప్-5 డయాబెటిస్' వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ రకం డయాబెటిస్ పోషకాహార లోపం, క్లోమ గ్రంథి సమస్యలతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. టైప్-1, టైప్-2 డయాబెటిస్లతో పోలిస్తే, టైప్-5 డయాబెటిస్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి..ఇలాంటి మెట్రెస్ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పెరిగిన డీహైడ్రేషన్ డ్రింక్స్ విక్రయాలు..
ఇది ప్రధానంగా తక్కువ బరువు, పోషకాహార లోపం ఉన్న వ్యక్తుల్లో కనిపిస్తుంది. భారత్లో ఈ రకం డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పరిశోధకులు ఈ రకం డయాబెటిస్ను నియంత్రించడానికి పోషకాహారం మెరుగుపరచడం, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచి స్తున్నారు. ఈ అధ్యయనం భారత్లో డయాబెటిస్ చికిత్స, నివారణ విధానాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది. ప్రజలు బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఆల్కహాల్ వ్యసనం గురించి వెల్లడించకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సాధ్యం కాదా..? సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కళ్ళజోడు ధరించడం వల్ల కాలక్రమేణా కంటి చూపు బలహీన పడుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
