మలేరియా రహిత దేశంగా ప్రత్యేక చర్యలు..
సాక్షి లైఫ్ : భారత్ 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ దిశగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దోమల నుంచి రక్షించడానికి పలు చిట్కాలను పాటించడం ద్వారా తమ పిల్లలను మలేరియా నుంచి కాపాడవచ్చని, అందుకోసం తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. "మలేరియా రహిత భారత్ " కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యత నిర్వర్తించాలని ఈ సందర్భంగా నిపుణులు పిలుపునిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
మలేరియా లక్షణాలు..
మలేరియా లక్షణాలు సాధారణంగా దోమ కాటు తర్వాత 10 నుంచి 15 రోజుల్లో కనిపిస్తాయి. జ్వరం, చలి, తలనొప్పి, నీరసం వంటివి సాధారణ లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో రక్తహీనత, శ్వాసకోశ సమస్యలు, మూర్ఛలు వంటివి సంభవించవచ్చు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..ఈ చౌకైన ఆహారంతో విటమిన్ B12 పొందవచ్చు..
ఇది కూడా చదవండి.. కీమోథెరపీ వల్ల వచ్చే రక్తహీనతకు అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఔషధం..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
