Women Outlive Men : ఆయుష్షులో 'ఆడవారే' మేటి.. మగాళ్ల ఆయువు ఎందుకు తగ్గుతోంది..? కేరళ యూనివర్సిటీ షాకింగ్ సర్వే..!
సాక్షి లైఫ్ : మనం ఎంత కాలం బతుకుతామనేది మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. అయితే, దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో పురుషులు, మహిళల ఆయుష్షుపై జరిగిన ఈ అధ్యయనం అనేక కొత్త కోణాలను ఆవిష్కరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో మనుషుల ఆయుష్షుపై కేరళ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా సర్వే సంచలన నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
సర్వేలోని విశేషాలు..
దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పురుషుల ఆయుష్షు మహిళల కంటే దాదాపు 6 నుంచి 7 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. ముఖ్యంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
పురుషుల ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
గుండె జబ్బులు, ఒత్తిడి.. కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుషులలో పెరిగే తీవ్రమైన మానసిక ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తోంది. చిన్నపాటి అనారోగ్యం కలిగినా మహిళలు వెంటనే డాక్టరును సంప్రదిస్తుంటే, పురుషులు మాత్రం సమస్య ముదిరే వరకు ఆసుపత్రికి వెళ్లడం లేదని సర్వే చెబుతోంది. మద్యపానం, ధూమపానం, శారీరక శ్రమ లేని జీవనశైలి పురుషుల ప్రాణాలను హరిస్తోందని కేరళ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి.
దీనికి పరిష్కారం ఏమిటి..?
పురుషులు 40 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా ఏడాదికి ఒకసారి 'మాస్టర్ హెల్త్ చెకప్' చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా, శారీరక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టినప్పుడే ఆయుష్షును పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఆయుష్షు అనేది ప్రకృతి ఇచ్చే వరం మాత్రమే కాదు, మనం క్రమశిక్షణతో నిర్మించుకునే ఆరోగ్యం కూడా ప్రధానమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
