40 ఏళ్లు దాటాక పురుషుల్లో వచ్చే వ్యాధులు..ఇవే..   

షేర్ చేయండి:
40 ఏళ్లు దాటాక పురుషుల్లో వచ్చే వ్యాధులు..ఇవే..   

సాక్షి లైఫ్ : 40 ఏళ్లు దాటిన తర్వాత శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.. మహిళలతో పాటు పురుషుల ఆరోగ్యంపై కూడా నలభై ఏళ్ల తరువాత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సు దాటిన తర్వాత, శారీరక, మానసిక మార్పులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల, ఈ వయస్సు నుంచే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక శ్రద్ధ, రెగ్యులర్ ఆరోగ్య పర్యవేక్షణ ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

40 ఏళ్ల తరువాత మార్పులు..  

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత, పురుషులలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిలో ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది పురుషులలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ఒకటి. అయితే, ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. కనుక PSA (Prostate Specific Antigen) పరీక్షలు, డిజిటల్ మల పరీక్షలు వంటి రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించడం ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. 

కండరాల బలహీనత, ఎముక సాంద్రత తగ్గుదల..  

మరొక ముఖ్యమైన విషయం సార్కోపెనియా, ఆస్టియోపెనియా వంటి పరిస్థితులు. వీటిలో పురుషులు, 40 ఏళ్ల తర్వాత కండరాల బలం, ఎముక సాంద్రత కోల్పోతుంటారు. ఇది ఎముకల బలహీనతకు, కండరాల సామర్థ్యం దెబ్బ తినడానికి దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, ఎముక సాంద్రతను మెరుగుపరచే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?

ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..? 

ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే.. 

 

40 ఏళ్ల వయస్సు తర్వాత హార్మోనల్ చేంజెస్.. 

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత, హార్మోన్ల మార్పులు కూడా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ హార్మోనల్ మార్పులు కారణంగా డయాబెటీస్, బరువు పెరగడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో, ఆరోగ్యకరమైన ఆహారం, నిరంతర వ్యాయామం చాలా అవసరం.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో…

వైద్య నిపుణులు చెబుతున్నట్లు, 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి. వైద్యపరీక్షలు, స్క్రీనింగ్, రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం. ఇవన్నీ నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకునేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

కాబట్టి, నలభై ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా పలు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.