సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు చాలామంది విటమిన్ మాత్రలు, సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఏయే మాత్రలు కలిపి వేసుకోవాలి? వేటి మధ్య విరామం ఉండాలి? అనే అవగాహన లేకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటీషియన్ల సూచనల ప్రకారం.. ఈ క్రింది ఏడు రకాల సప్లిమెంట్లను ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
1. కాల్షియం - ఐరన్..
ఈ రెండూ విడివిడిగా మన శరీరానికి ఎంతో అవసరం. కానీ రెండింటినీ ఒకేసారి తీసుకుంటే, కాల్షియం మన శరీరంలో ఐరన్ గ్రహించబడకుండా (Absorption) అడ్డుకుంటుంది. వీటి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండటం ఉత్తమం.
2. విటమిన్-సి - విటమిన్-బి12..
విటమిన్-సి మన శరీరానికి మేలు చేసినప్పటికీ, అధిక మోతాదులో దీన్ని బి12తో కలిపి తీసుకుంటే.. అది బి12 విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది. తద్వారా శరీరానికి అందాల్సిన బి12 లభించదు.
3. మెగ్నీషియం - మల్టీ విటమిన్..
మల్టీ విటమిన్లలో అప్పటికే కొంత మోతాదులో ఖనిజాలు ఉంటాయి. వాటితో పాటు అధిక మోతాదులో మెగ్నీషియంను కలిపి తీసుకుంటే, ఇతర ఖనిజాల (మెగ్నీషియం, కాల్షియం వంటివి) గ్రహింపులో పోటీ ఏర్పడి శరీరానికి ఏదీ సరిగ్గా అందదు.
4. జింక్ - కాపర్..
జింక్ అధికంగా తీసుకుంటే అది శరీరంలో రాగి నిల్వలను తగ్గిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడాల్సి వస్తే, వాటి నిష్పత్తిని వైద్యుల సలహా మేరకు మాత్రమే నిర్ణయించుకోవాలి.
5. గ్రీన్ టీ - ఐరన్..
బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతూ, రక్తం కోసం ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? గ్రీన్ టీలో ఉండే 'టానిన్స్' ఐరన్ శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఐరన్ మాత్ర వేసుకునే ముందు లేదా తర్వాత కనీసం గంట వరకు టీ, కాఫీలు మానుకోవాలి.
6. విటమిన్-ఎ - రెటినాయిడ్స్..
చర్మ సమస్యల కోసం వాడే రెటినాయిడ్ క్రీములు లేదా మందులతో పాటు విటమిన్-ఎ సప్లిమెంట్లు వాడటం వల్ల శరీరంలో విటమిన్-ఎ మోతాదు పెరిగి 'టాక్సిసిటీ' (విషతుల్యం) అయ్యే ప్రమాదం ఉంది.
7. మెగ్నీషియం - కాల్షియం..
ఎక్కువ మొత్తంలో ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఒకదాని శోషణను మరొకటి అడ్డుకుంటాయి. ఎముకల పుష్టి కోసం వీటిని వాడేవారు వేర్వేరు సమయాల్లో ఉదాహరణకు ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం తీసుకోవడం మంచిది. సప్లిమెంట్లు అనేవి ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. ఏదైనా విటమిన్ లోపం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి, వారు సూచించిన క్రమంలోనే మందులు వాడాలి. సొంత వైద్యం ఎప్పుడూ ప్రమాదకరమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com