సాక్షి లైఫ్: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నసమయంలో డీహైడ్రేషన్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వేడిగాలులు, తద్వారా శరీరంలో ఎలక్ట్రోలైట్ల నష్టం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు నొక్కి చెబుతున్నారు. సాధారణ ఓరల్ రీహైడ్రేషన్ సలైన్ (ఓఆర్ ఎస్)కు మించి, సమగ్ర ఎలక్ట్రోలైట్-ఆధారిత పానీయాల ఆవశ్యకతను వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
కేవలం సోడియం మాత్రమే కాదు..
సీనియర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్ డాక్టర్ బి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, "వేడి గాలుల బారిన పడటం వల్ల ఎలక్ట్రోలైట్స్ తగ్గడం కేవలం సోడియానికే పరిమితం కాదు. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటివి కూడా శరీరం కోల్పోతుంది. ఈ ఎలక్ట్రోలైట్స్ శరీర కణజాల పనితీరుకు, కోలుకోవడానికి అత్యవసరం. అవి పునరుద్ధరించనప్పుడు, శరీరం నీరసిస్తుంది, నిరంతర అలసట లేదా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది" అని వివరించారు.
డాక్టర్ రవీందర్ రెడ్డి ఓఆర్ ఎస్ ప్రధానంగా డయేరియా సంబంధిత డీహైడ్రేషన్ కోసం రూపొందించిందని, అయితే డయేరియా కాని ఇతర రకాల డీహైడ్రేషన్ సమస్యలను పరిష్కరించకపోవచ్చని పేర్కొన్నారు. అధిక చెమట, జ్వరం, కండరాల తిమ్మిరి వంటి పరిస్థితులలో సోడియం, గ్లూకోజ్తో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను కూడా తిరిగి పొందడం అవసరం. లేకపోతే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వంటి వారికి హైపర్నాట్రేమియా వంటి సమస్యలు తలెత్తవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పోషక లోపాలు..
కరీంనగర్లో జరిగిన ఒక అధ్యయనంలో 70శాతం కంటే ఎక్కువ మంది రోజువారీ వేతన కార్మికులు, విక్రేతలు కేవలం నీరు లేదా ప్రాథమిక ఎలక్ట్రోలైట్ ప్యాకెట్లపై ఆధారపడి, కాళ్ళ నొప్పులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఇది తగినంత రీహైడ్రేషన్ జరగడం లేదని సూచిస్తుంది.
ఇటీవలి పోషక అధ్యయనాలు భారతీయులలో పొటాషియం తీసుకోవడం తక్కువగా ఉందని, ఇది గుండె లయ, కండరాల సంకోచానికి కీలకమని వెల్లడించాయి. పొటాషియం లేనప్పుడు శరీరం నీటిని సమర్థవంతంగా నిలుపుకోలేదు.
"అన్ని రకాల డీహైడ్రేషన్కు ఒకే ఫార్ములాను ఉపయోగించడం ఇకపై వైద్యపరంగా లేదా శాస్త్రీయంగా సమర్థనీయం కాదు" అని డాక్టర్ అబ్దుల్ మాజీద్ ఖాన్ అన్నారు. వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు, హైడ్రేషన్ వ్యూహాలు కూడా మారాలని ఆయన సూచించారు.
కాగా, గత సంవత్సరం, ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు ఆరోగ్య సంస్థ అయిన కెన్వ్యూ, 'ది హైడ్రేషన్ గ్యాప్ ఫర్ నాన్-డయేరియా ఇల్నెస్స్' నివేదికను విడుదల చేసింది. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వైరల్ అనారోగ్యాలు వంటి డయేరియా కాని అనారోగ్య సమస్యలలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, శక్తి (FEE) పాత్రను ఈ నివేదిక నిరూపించింది. సాదా నీరు, కొబ్బరి నీరు, ORS పౌడర్ల కంటే రెడీ-టు-డ్రింక్ సొల్యూషన్స్ FEE పునరుద్ధరణకు ఉత్తమమైనవి అని నివేదిక తేల్చింది.
కెన్వ్యూ సీనియర్ ఆర్&డి డైరెక్టర్ నాగరాజన్ రామసుబ్రమణియం మాట్లాడుతూ, "డీహైడ్రేషన్ ను చాలామంది విస్మరిస్తారు. కెన్వ్యూ వద్ద, మేము సమగ్ర హైడ్రేషన్ పోర్ట్ఫోలియో ద్వారా వేగంగా మెరుగ్గా ఉండేలా చేయడానికి కట్టుబడి ఉన్నాము." అని తెలిపారు.
"మనం హైడ్రేషన్ను కేవలం పానీయాలు తాగడం అనే సాధారణ విషయంగా భావించడం మానేయాలి. శరీరానికి అవసరమైన పోషకాలను తిరిగి అందించడం గురించి" ప్లాన్ చేయాలని డాక్టర్ అబ్దుల్ మాజీద్ ఖాన్ అంటున్నారు. వేసవిలో వేగంగా కోలుకోవడానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు, శక్తిని అందించే సరైన హైడ్రేషన్ పరిష్కారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యమని వారు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com