Micronutrients Matter : శరీరానికి ‘సూక్ష్మ’ పోషకాలే రక్ష: ఇలాంటి సంకేతాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే..!
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిపోయిన ఆహారపు అలవాట్లు మానవ శరీరాన్ని రోగాల నిలయంగా మారుస్తున్నాయి. నేటి తరం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్ల వైపు మొగ్గు చూపుతుండటంతో కడుపు నిండుతున్నా... శరీరానికి అందాల్సిన అసలైన పోషకాలు మాత్రం అందడం లేదు. ఫలితంగా దేశంలో ‘సూక్ష్మపోషకాల లోపం’ (Micronutrient Deficiency) వేగంగా పెరుగుతోందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
పేరుకు ‘సూక్ష్మ’ పోషకాలే అయినప్పటికీ, ఇవి శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎముకల దృఢత్వానికి, హార్మోన్ల సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అయోడిన్, జింక్, విటమిన్-డి, ఐరన్ లోపాలు ప్రధాన ఆరోగ్య సమస్యలుగా మారాయి. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, కౌమారదశలో ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు మరియు చిన్న పిల్లలు ఈ సమస్య బారిన పడుతున్నారు. శరీరంలో ఏ పోషకం లోపిస్తే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో వైద్య నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
