క్యాన్సర్‌ : ఈ 5 ఆహారాలను ఎక్కువ సేపు వండడం మరణాన్ని ఆహ్వానించినట్లే.. 

షేర్ చేయండి:
క్యాన్సర్‌ : ఈ 5 ఆహారాలను ఎక్కువ సేపు వండడం మరణాన్ని ఆహ్వానించినట్లే.. 

సాక్షి లైఫ్ : ఏ ఆహారం క్యాన్సర్‌కు కారణమవుతుంది: అనేక రకాల క్యాన్సర్‌లు ఉన్నాయి..వీటికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, అన్ని ప్రమాద కారకాల గురించి చెప్పడం, వాటిని నియంత్రించడం కష్టం. వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్ కేసులలో 80-90 శాతం చెడు అలవాట్లు, పలు రకాల కారణాల వల్ల సంభవిస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అటువంటి ప్రధాన కారణాల్లో చెడు జీవనశైలి అలవాట్లు కూడా ఉన్నాయి, వీటిని మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

క్యాన్సర్ల కు కారణం.. 

ఆహారం అనేక రకాల క్యాన్సర్ల కు కారణమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. ఆహారం కారణంగా క్యాన్సర్ కణితులు పెరగకుండా నిరోధించవచ్చు, దానికి కారణమయ్యే అనేక ఆహారాలు ఉన్నాయి. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఐదురకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

మాంసం.. 

2020 నివేదిక ప్రకారం అతిగా ఉడికించిన మాంసం తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక వేడి వద్ద మాంసాన్ని వండడం వల్ల క్యాన్సర్ కారక పల్మనరీ ఆర్టరీయల్ హైపర్ టెన్షన్ (PAHలు),హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు) ఉత్పత్తి అవుతాయి. ఈ పదార్ధాలు కణాల డీఎన్ ఏను మార్చడమేకాకుండా క్యాన్సర్ కణితులకు కారణమవుతాయి.

బంగాళదుంప.. 

బంగాళాదుంపలను ఎక్కువసేపు ఉడికించి తింటే క్యాన్సర్ వస్తుంది. నిజానికి, వాటిని ఎక్కువగా వేయించడం లేదా కాల్చడం వల్ల క్యాన్సర్ కారకమైన యాక్రిలామైడ్ రసాయనం విడుదలవుతుంది. కాబట్టి బంగాళదుంపలను ఎక్కువగా వేయించడానికి బదులు మీడియంగా ఉడికించడం మంచిది.

ఆకు కూరలు.. 

బచ్చలికూర, మెంతికూర వంటి ఆకు కూరలు ఇనుము, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి, కానీ అవి ఎక్కువగా ఉడికినప్పుడు కొన్ని రసాయన మార్పులు సంభవించి వాటి పోషక విలువలు తగ్గుతాయి. ఎక్కువసేపు ఉడికించినప్పుడు, వాటిలో ఉండే నైట్రేట్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయి.

బియ్యం.. 

బియ్యం, ఇతర ధాన్యాలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది, ఇది క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో, బియ్యం సరైన విధంగా ఉడకబెట్టడం ముఖ్యం.

తేనె.. 

అధిక ఉష్ణోగ్రతల వద్ద తేనెను వేడి చేయడం వల్ల దానిని హైడ్రాక్సీమీథైల్ఫర్‌ఫ్యూరల్ (హెచ్ ఎంఎఫ్)గా మారవచ్చు.హెచ్ ఎంఎఫ్ క్యాన్సర్ కారకం. ఇది శరీరంలో ప్రాణాంతక గడ్డలను కలిగిస్తుంది. అందువల్ల, ఎల్లప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తేనెను వాడండి, "టీ"లో చేర్చే ముందు వేడి చేయవద్దు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.