ఆరోగ్యకరమైన మనస్సు కోసం ఏడు హెల్తీ హ్యాబిట్స్..   

షేర్ చేయండి:
ఆరోగ్యకరమైన మనస్సు కోసం ఏడు హెల్తీ హ్యాబిట్స్..   

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలిలో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మనసును తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది మన దైనందిన కార్యకలాపాలపై, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మనసును ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని సాధారణ అలవాట్లు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

 

తగినంత నిద్ర..  

 మనసును తాజాగా ఉంచడానికి అతి ముఖ్యమైనది మంచి, పూర్తి నిద్ర. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర పొందడం వల్ల మనసు రీఛార్జ్ అవుతుంది, ఉదయం నిద్ర లేవగానే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.  నిద్రలేమి చిరాకు, అలసట, ఏకాగ్రత లేకపోవడానికి దారితీస్తుంది. కాబట్టి, నిద్రించడానికి, మేల్కొనడానికి ఒక సాధారణ సమయాన్ని నిర్ణయించుకోండి. నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించండి, నిద్రవేళకు 7 గంటల ముందు వరకు కాఫీ తాగవద్దు.

 సరిపడా నీళ్ళు..  

మీరు ఉదయం మేల్కొన్నప్పుడు, రాత్రిపూట నీరు త్రాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందువల్ల, ఉదయం మేల్కొన్న వెంటనే 1 నుంచి 2 గ్లాసుల నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది, మనస్సు తాజాగా ఉంటుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ ,తేనె కలిపి కూడా తాగవచ్చు.

 ఉదయం నడక.. 

ఉదయం తాజా గాలి, తేలికపాటి వ్యాయామం మెదడును యాక్టివేట్  చేయడానికి ఉత్తమ మార్గం. ఇది ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది, సంతోషకరమైన హార్మోన్లను (ఎండార్ఫిన్లు) విడుదల చేస్తుంది, ఇది మానసిక స్థితిని తాజాగా ఉంచుతుంది. 

 వ్యాయామం.. 

 ఉదయం మేల్కొన్న తర్వాత, కనీసం 20 నుంచి 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.

 ఆరోగ్యకరమైన అల్పాహారం.. 

ఉదయం తీసుకునే అల్పాహారం మనసును ఉత్సాహంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పొద్దున్నే తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యమైనది. ఎక్కువ నూనెతో కూడిన అల్పాహారానికి బదులుగా, ఆరోగ్యకరమైన, తేలికైన అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. ఇది శక్తిని ఇస్తుంది, మెదడుకు పోషకాలను అందిస్తుంది. అల్పాహారంలో ఓట్స్, గంజి, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది.

  ధ్యానం, సానుకూల ఆలోచన..  

ఉదయం కొన్ని నిమిషాలపాటు ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవడంతోపాటు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్‌ చూడకుండా ఉండా, సానుకూల విషయాలపై దృష్టి పెట్టాలి.  

 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.