విటమిన్ "డి" ఎక్కువైతే ప్రాణాంతక వ్యాధులు తప్పవా..?
సాక్షి లైఫ్ : మన శరీరానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. శరీరంలో ఏదైనా విటమిన్ లోపాన్ని వైద్యనిపుణుల సలహా మేరకు సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేయవచ్చు. కానీ శరీరంలో ఏదైనా విటమిన్ మోతాదు అధికంగా ఉండడం వల్ల ప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల యూకే లో ఒక వ్యక్తి 9 నెలల పాటు నిరంతరం విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మరణించాడు.
ఇది కూడా చదవండి.. లెమన్గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం..
ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్లను కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనంలో మహిళల్లో కాల్షియం,విటమిన్ డి ప్రభావాన్ని అధ్యయనం చేశారు వైద్యులు. ఇందులో కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు ఎముక సాంద్రత తగ్గడం వల్ల రుతువిరతి తర్వాత మహిళలకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బోలు ఎముకల వ్యాధి తక్కువ కాల్షియం స్థాయిలతో ముడిపడి ఉంది. విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. కానీ ఈ సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
