Benefits of Multani Mitti : ముల్తానీ మట్టితో హెల్త్ బెనిఫిట్స్ ఇవిగో.. !

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఎండ ప్రభావం వల్ల చర్మం త్వరగా నిగారింపును కోల్పోతుంది. ముఖంపై పేరుకుపోయే మురికిని తొలగించుకునేందుకు చాలామంది ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన 'ముల్తానీ మట్టి'తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇది చర్మంపై ఉండే మృతకణాలు, అదనపు జిడ్డు, మురికిని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఎవరి చర్మ తత్వానికి తగ్గట్టుగా వారు ముల్తానీ మట్టిని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

ముల్తానీ మట్టి అద్భుత ప్యాక్‌లు..

1. జిడ్డు చర్మానికి రోజ్ వాటర్                                                       ..

జిడ్డు, లేదా మిశ్రమ చర్మం (Combination skin) ఉన్నవారు ముల్తానీ మట్టిలో కొద్దిగా గులాబీ జలం (Rose water) కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రం చేసి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.

2. పొడి చర్మానికి తేనెతో తేమ..


సాధారణంగా ముల్తానీ మట్టి చర్మాన్ని కాస్త పొడిగా మారుస్తుంది. కాబట్టి, పొడి చర్మం (Dry skin) ఉన్నవారు ఇందులో ఒక చెంచా తేనె కలుపుకుని వాడటం మంచిది. తేనె చర్మానికి అవసరమైన తేమను అందిస్తే, ముల్తానీ మట్టి మురికిని వదిలిస్తుంది. దీంతో ముఖం మృదువుగా మారుతుంది.

3. టానింగ్ పోవడానికి పెరుగు..

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి రాసుకుంటే చర్మంపై ఉన్న టానింగ్ సులభంగా తొలగిపోయి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

4. సున్నిత చర్మానికి కలబంద..

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ముల్తానీ మట్టి, తాజా కలబంద (Aloe vera) గుజ్జు మిశ్రమం బెస్ట్ ఆప్షన్. ఇది చర్మానికి చల్లదనాన్ని, హైడ్రేషన్‌ను అందిస్తూనే అదనపు జిడ్డును తొలగిస్తుంది.

5. చల్లదనం కోసం గంధం..

ముల్తానీ మట్టిలో కొద్దిగా గంధం పొడి, గులాబీ జలం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్యాక్ వాడితే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

6. రెట్టింపు నిగారింపుకు పసుపు, శెనగపిండి..

ఒక చెంచా ముల్తానీ మట్టిలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు, గులాబీ జలం కలిపి ప్యాక్ వేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చర్మం లోపలి నుంచి శుభ్రపడి ముఖంపై మంచి గ్లో వస్తుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ముల్తానీ మట్టి ప్యాక్‌ను ప్రతిరోజూ కాకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి.

ఫేస్ ప్యాక్ ముఖంపై పూర్తిగా, బిరుసుగా ఎండిపోయే వరకు ఉంచుకోకూడదు. కొద్దిగా తడిగా ఉన్నప్పుడే కడిగేయాలి.

పొడి చర్మం ఉన్నవారు తమ ఫేస్ ప్యాక్‌లో తప్పనిసరిగా తేనె లేదా కలబంద కలుపుకోవడం మర్చిపోవద్దు.

ప్యాక్ కడిగేసిన తర్వాత ముఖం పొడిబారకుండా తప్పనిసరిగా మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

దీన్ని మొదటిసారి వాడేవారు ముందే చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.