పిల్లల కంటి క్యాన్సర్‌పై అవగాహన అవసరం.. 

షేర్ చేయండి:
పిల్లల కంటి క్యాన్సర్‌పై అవగాహన అవసరం.. 

సాక్షి లైఫ్ : చెన్నైలోని ప్రముఖ కంటి ఆసుపత్రి సంస్కరణ నేత్రాలయ ఆధ్వర్యంలో పిల్లల కంటి క్యాన్సర్ అయిన రెటినోబ్లాస్టోమా పై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రెటినోబ్లాస్టోమా ను ప్రారంభ దశలో గుర్తిస్తే, చికిత్స ద్వారా 90శాతం వరకు పిల్లల కండ్లను కాపాడవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం పిల్లలు ఆలస్యంగా చికిత్స పొందడం వల్ల కంటి కోల్పోవడం లేదా చనిపోవడం జరుగుతుందని సంస్కరణ నేత్రాలయ డాక్టర్ సుగణేశ్వరి గణేశన్ చెబుతున్నారు.

ది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఈ నేపథ్యంలో పిల్లల కంటి పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా అవసరం, కుటుంబసభ్యుల్లో ఎవరికైనా రెటినోబ్లాస్టోమా ఉన్నట్లయితే, ముందస్తు పరీక్షలు చేయించడం ముఖ్యమని డాక్టర్ సుగణేశ్వరి సూచిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కంటి క్యాన్సర్ నిపుణులు, పిల్లల వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, రేడియేషన్ నిపుణులు పాల్గొన్నారు. వారు పిల్లల కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా పిల్లల కంటి క్యాన్సర్ పై సమాజంలో అవగాహన పెంచడం, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.