వంట చేయడానికి నాన్-స్టిక్ పాత్రలను ఎందుకు వాడకూడదు..? 

సాక్షి లైఫ్ : నేటి జీవనశైలి కారణంగా చాలా మంది మహిళలు తమ వంటగదిలో రంగురంగుల నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించడానికి ఇష్టపడతున్నారు. ఈ రంగురంగుల పాత్రలు వంట చేసేటప్పుడు తక్కువ నూనెను ఉపయోగించడమే కాకుండా వినియోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. జీవితాన్ని సులభతరం చేసే ఈ నాన్‌స్టిక్ పాత్రలతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వంట కోసం ఉపయోగించే ఈ నాన్‌స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి  తీవ్రమైన హాని కలిగిస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి.. యోగాతో శరీరాన్ని నిర్విషీకరణ..?  

భారతీయుల కోసం జారీ చేసిన కొత్త ఆహార మార్గదర్శకాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) నాన్-స్టిక్ పాత్రలలో ఆహారాన్ని వండకూడదని సూచించాయి. దీని వెనుక దాగి ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

నాన్-స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు.. 

ఎన్నో ఏళ్లుగా నాన్ స్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వండడం వల్ల శరీరంలో టెఫ్లాన్ పరిమాణం పెరుగుతుందని, దీని వల్ల మనిషికి అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. నాన్‌స్టిక్ ప్యాన్‌లలో సింథటిక్ పాలిమర్‌లు ఉంటాయి. వీటిని పాలిటెట్రా ఫ్లోరోఎథిలిన్, టెఫ్లాన్ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితిలో టెఫ్లాన్ నుంచి అధిక మంటపై విడుదలయ్యే రసాయనాలు వంధ్యత్వం, గుండె సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి.

ఇలాంటి పాత్రల్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల మనిషి శరీరంలో ఐరన్ లోపంతోపాటు దానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.  

అధిక మంటపై నాన్-స్టిక్ వంటసామాను వేడిచేసినప్పుడు, వాటి నుంచి  విడుదలయ్యే రసాయనాలు విషపూరితమైన పొగను గాలిలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల పొగ క్యాన్‌కు గురైన వ్యక్తులకు శ్వాసకోశ సమస్యలు ,థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

 నాన్‌స్టిక్‌ పాన్‌ను ఖాళీగా వేడిచేసినప్పుడు, దాని నుంచి కొన్ని వాయువులు విడుదలవుతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి కడుపు నొప్పిని కూడా కలిగిస్తాయి.

-అధిక ఉష్ణోగ్రతల వద్ద వండడం వల్ల లేదా ఎక్కువసేపు నాన్ స్టిక్ పాత్రలు వాడడం వల్ల వాటిపై పూత పోవడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ పాత్రలపై ఆహారాన్ని వండినప్పుడు, ఈ పూత ఆహారంలో కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే హానికరమైన రసాయనాలు కడుపులోకి వెళతాయి. 

మట్టి కుండలలో..

మట్టి కుండలలో ఆహారాన్ని వండటం ఉత్తమ పరిష్కారమని ఐసీఎంఆర్ వెల్లడించింది. మట్టి కుండలలో ఆహారాన్ని వండుకోవడమే కాకుండా వాటిలో ఆహారాన్ని నిల్వ చేసుకోవచ్చు. మట్టి కుండలో ఆహారాన్ని వండడం వల్ల పోషకాలు చెడిపోకుండా ఉండడమే కాకుండా, రుచి కూడా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : harmful-to-health icmr-research research healthy-habits researchers food-habits cancer cancer-risk nin nonstick-utensils

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com