Fruits Cause Diabetes : పండ్లు తింటే మధుమేహం వస్తుందా..?డైటీషియన్స్ ఏం చెబుతున్నారు..?
సాక్షి లైఫ్ : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రంగురంగుల కూరగాయలు, నట్స్, గింజలతో పాటు రోజూ తాజా పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. అయితే పండ్లలో సహజసిద్ధంగా తియ్యదనం ఉంటుంది కాబట్టి, రోజూ పండ్లు తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాం ఉందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై ప్రముఖ డైటీషియన్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
పండ్లలోని సహజ చక్కెర హానికరమా..?
పండ్లలో ఫ్రక్టోజ్ రూపంలో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. అయితే పండు కేవలం చక్కెర మాత్రమే కాదు, దాంతో పాటు ఫైబర్, నీరు, ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి.
ప్యాకెట్లలో లభించే కృత్రిమ చక్కెరలు (Added sugars) ఆరోగ్యానికి హాని చేస్తాయి కానీ, పండ్లలో లభించే సహజ చక్కెర ఎప్పుడూ ప్రమాదకరం కాదు. కాబట్టి కేవలం పండ్లు తియ్యగా ఉంటాయన్న కారణంతో వాటిని మధుమేహానికి కారణమని భావించలేం.
జ్యూస్ రూపంలో తీసుకుంటే నష్టమేంటి..?
పండ్లను నేరుగా నమిలి తినడానికి బదులుగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అసలైన పోషకాలు కోల్పోతాము. జ్యూస్ చేసేటప్పుడు పండ్లలోని పీచు పదార్థం fiber) అంతా తొలగిపోతుంది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా జ్యూస్లకు బదులుగా ఎప్పుడైనా తాజా, సమగ్రమైన పండ్లను తినడమే ఉత్తమమని సూచిస్తోంది. అలాగే మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ ఫ్రూట్ డ్రింక్స్లో అదనపు చక్కెరలు కలుపుతారు కాబట్టి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి.
డ్రై ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్త అవసరమా..?
తాజా మౌసమీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఎండుద్రాక్షాలు, ఖర్జూరాలు, అంజూర వంటి డ్రై ఫ్రూట్స్ విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. పండ్లను ఎండబెట్టడం వల్ల వాటిలోని నీటి శాతం తగ్గిపోయి, చక్కెర సాంద్రత పెరుగుతుంది. వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ను పరిమితంగానే తీసుకోవాలి.
డయాబెటిస్ బాధితులు పండ్లు తినవచ్చా..?
డయాబెటిస్ వస్తుందనే భయంతో పండ్లను పూర్తిగా తినడం మానేయడం సరైన పద్ధతి కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండే తాజా పండ్లను ఎంచుకుని తినవచ్చు. జ్యూస్లు, మిల్క్షేక్లకు దూరంగా ఉండాలి. కేవలం ఒక్క పండు వల్ల మాత్రమే డయాబెటిస్ రాదు. జన్యుపరమైన కారణాలు, బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత వంటి అనేక అంశాలు దీనికి కారణమవుతాయి. కాబట్టి ఆహారపు అలవాట్లతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
