క్యాన్సర్ పై పోరాడేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక చర్యలు..
సాక్షి లైఫ్ : క్యాన్సర్పై పోరాటానికి హిమాచల్ ప్రదేశ్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 69 మోడల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయగా, క్యాన్సర్ రోగులకు 49 కేంద్రాల్లో కీమోథెరపీ సౌకర్యం కల్పించనున్నారు. రాష్ట్రంలోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందికి దేశంలోని పేరెన్నికగన్న క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 69 మోడల్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 49 చోట్ల ఇలాంటి కేంద్రాలు ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో నలుగురి నుంచి ఆరుగురు నిపుణులైన వైద్యులను నియమించారు.
ఇది కూడా చదవండి..పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే టాప్ ఫుడ్స్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఈ కేంద్రాల్లో కేన్సర్ రోగులకు కీమోథెరపీ సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందికి దేశంలోని పేరెన్నికగన్న క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వైద్యులు మూడు వారాల శిక్షణ పొందుతున్నారు.
పారామెడికల్ సిబ్బందికి వారం రోజుల శిక్షణ ఇస్తున్నారు. మోడల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో దశలవారీగా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు తర్వాత కేన్సర్ రోగులు పీజీఐ, ఎయిమ్స్ తదితర రాష్ట్రాలకు చికిత్స, కీమోథెరపీ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. జనాభా ప్రాతిపదికన, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
