సాక్షి లైఫ్ : ముప్పై ఏళ్ల వయసు తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు ప్రారంభ మవుతాయి. అటువంటి మార్పుల్లో ఎముకలు బలహీనపడుతాయి. 30 సంవత్సరాల వయస్సు తర్వాత, ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతుంది. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి(ఆస్టియోపోరోసిస్) లక్షణాలు అంటే ఎముకలు బలహీనపడటం గణనీయంగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మీకు 30 ఏళ్లు దాటాయా..? లేదా 30 ఏళ్లు నిండ బోతున్నాయా..? అయితే ఆర్టికల్ మీ కోసమే. 30 ఏళ్ల తర్వాత స్త్రీల ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. అందువల్ల ఆస్టియోపోరోసిస్ ప్రమాదం పెరుగుతుంది. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
'నిశ్శబ్ద వ్యాధి' అని పిలిచే ఆస్టియోపోరోసిస్ డిసీజ్ ఎముకలను బలహీనంగా పెళుసుగా చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. తద్వారా ఎముకలు బలహీనపడుతాయి.
కొన్ని సులభమైన మార్పులు, అలవాట్ల ద్వారా ఆస్టియోపోరోసిస్ నివారించవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 30సంవత్సరాల తర్వాత, స్త్రీల ఎముకలు బలహీనంగా మారుతాయి. బలహీనమైన ఎముకలు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఆస్టియోపోరోసిస్ను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com