తెలంగాణ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025’ను ఆవిష్కరించింది. ఈ పథకం రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్రజలను, ముఖ్యంగా 1.6 కోట్ల మంది అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారిని రక్షించేందుకు రూపొందించారు. 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ ప్రమాదం మరింతగా ఉండే అవకాశం ఉందని ఇండియా మెటీరియాలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండి) హెచ్చరిస్తోంది.

 

ఇది కూడా చదవండి..గుండెపోటు సంకేతాలు పురుషులు, మహిళలలో భిన్నంగా ఉంటాయా..?

ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాలు గత ఏడాది అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నాయి, అయితే హైదరాబాద్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో  తక్కువ ప్రభావం కనిపించింది. ఈ అసమానతలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి జిల్లాకు ప్రత్యేక చర్యలతో ఈ ప్లాన్ రూపొందించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ లోని ప్రధాన అంశాలు.. 

వైద్య వసతులు : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక బెడ్‌లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను సిద్ధం చేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పంపిణీ చేయనున్నారు.

అవగాహన కార్యక్రమాలు: టీవీ, రేడియో, వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా హీట్‌వేవ్ హెచ్చరికలు, నివారణ చిట్కాలను ప్రజలకు అందించనున్నారు. గ్రామాల్లో పోస్టర్లు, పంప్లెట్లు పంపిణీ చేస్తారు.

షెల్టర్ సౌకర్యాలు: బస్టాండ్లు, ఆలయాలు, ప్రభుత్వ భవనాల్లో తాగునీటి సౌకర్యాలు, షేడ్‌లు ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీలకు ప్రత్యేక ఆశ్రయ కేంద్రాలు ఉంటాయి.

విద్యా సంస్థల్లో జాగ్రత్తలు: మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు పాఠశాలల్లో తరగతులు నిషేధం. విద్యార్థులకు హీట్‌స్ట్రోక్ నివారణపై అవగాహన కల్పిస్తారు.

వ్యవసాయ, పశుసంవర్ధక రంగాలకు సహాయం: పశువులకు తాగునీరు, నీడ సౌకర్యాలు, అవసరమైన మందుల సరఫరా.

ప్రభుత్వ చర్యలు..  

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ప్లాన్‌ను ఆవిష్కరించారు. హీట్‌వేవ్‌ను ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించిన ప్రభుత్వం, హీట్‌స్ట్రోక్ వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 612 మండలాల్లో 588 మండలాలు హీట్‌వేవ్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. “ప్రజలను రక్షించడమే మా ప్రథమ లక్ష్యం. ఒకవేళ వడ దెబ్బ కారణంగా మరణాలు సంభవిస్తే, వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం,” అని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజలు ఏం చేయాలి..?
 
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోండి.
తగినంత నీరు, ఓఆర్ఎస్ తాగండి, తేలికైన దుస్తులు ధరించండి.
జ్వరం, వాంతులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

తెలంగాణకు హెచ్చరిక.. 

2024లో ఎండలు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను గడగడలాడించాయి. డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ కేసులు ఆసుపత్రులను నింపాయి. 2025లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రజలకు రక్షణ కవచంగా నిలవాలంటే, ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా కీలకం.

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.