సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ వేధించే ప్రధాన సమస్య 'అల్జీమర్స్' (Alzheimer's). ఇప్పటివరకు ఈ వ్యాధిని నిర్ధారించాలంటే ఖరీదైన పెట్ (PET) స్కాన్లు లేదా వెన్నెముక నుంచి ద్రవాన్ని తీసే (Lumbar Puncture) బాధాకరమైన పరీక్షలు తప్పనిసరి. కానీ ఇప్పుడు కేవలం ఒక చిన్న రక్త పరీక్షతో, కృత్రిమ మేధ (AI) సాయంతో అల్జీమర్స్ను చాలా ఏళ్ల ముందే గుర్తించే వినూత్న సాంకేతికత భారత్లో అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఏమిటీ పరీక్ష..? ఎలా పనిచేస్తుంది..?
మన మెదడులో 'అమైలాయిడ్ బీటా', 'టౌ' (Tau) అనే ప్రోటీన్లు అసాధారణంగా పేరుకుపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతిని అల్జీమర్స్ వస్తుంది. సాధారణ రక్త పరీక్షల్లో ఇవి అంత సులభంగా బయటపడవు. కానీ ఏఐ ఆధారిత 'సింగిల్ మాలిక్యూల్ అరే' (SiMoA) సాంకేతికత రక్తంలో అతి తక్కువ పరిమాణంలో ఉన్న ఈ ప్రోటీన్లను కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది. సేకరించిన నమూనాలను ఏఐ అల్గారిథమ్స్ విశ్లేషించి, భవిష్యత్తులో ఆ వ్యక్తికి వ్యాధి వచ్చే అవకాశం ఎంత ఉందో గణాంకాలతో సహా వెల్లడిస్తాయి.
ముందస్తు గుర్తింపుతో ప్రయోజనాలెన్నో..
సాధారణంగా అల్జీమర్స్ లక్షణాలు బయటపడేసరికి మెదడులో 60 శాతం నుంచి 70శాతం కణాలు ఇప్పటికే దెబ్బతిని ఉంటాయి. ఈ కొత్త పరీక్ష వల్ల 10-15 ఏళ్ల ముందే గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాలు మొదలవ్వకముందే అప్రమత్తం కావచ్చు. మెదడు కణాలు పూర్తిగా నశించకముందే మందులు ప్రారంభించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఆహారం, వ్యాయామం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోగికి తగిన సమయం దొరుకుతుంది.
భారత్కు ఎంతో అవసరం..
భారతదేశంలో ప్రస్తుతం సుమారు 50 లక్షల మందికి పైగా అల్జీమర్స్తో బాధపడుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని అంచనా. స్కాన్లతో పోలిస్తే రక్త పరీక్ష ధర చాలా తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రక్త నమూనాలను సేకరించి, పట్టణాల్లోని అధునాతన ల్యాబ్లకు పంపి పరీక్ష చేయించుకోవచ్చు. భారతీయ రోగుల జన్యు నిర్మాణం, జీవనశైలికి అనుగుణంగా ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడం వల్ల అల్జీమర్స్ కట్టడిలో మనం పెద్ద అడుగు వేయవచ్చని దేశీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com