Type 2 Diabetes Risk Rising Among Young Women: మహిళలకు యవ్వనంలోనే ‘టైప్-2’ ప్రమాదం.. వేగంగా పెరుగుతున్న మధుమేహ కేసులు..!
సాక్షి లైఫ్ : వయసు పైబడిన వారికే పరిమితమనుకునే ‘టైప్-2’ డయాబెటీస్ ఇప్పుడు యువతుల్లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 40 ఏళ్ల పైబడిన మహిళలతో పోలిస్తే.. 40 ఏళ్ల లోపు వయసున్న యువతుల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు వేగంతో పెరుగుతోందని తాజా అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. డయాబెటిస్ యూకే సంస్థ నిర్వహించిన తాజా విశ్లేషణ ప్రకారం.. గత కొన్నేళ్లుగా యువ జనాభాలో మధుమేహం విజృంభిస్తోంది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఆందోళన రేకెత్తిస్తున్న గణాంకాలు..
డయాబెటిస్ యూకే సంస్థ నిర్వహించిన తాజా విశ్లేషణ ప్రకారం.. గత కొన్నేళ్లుగా యువ జనాభాలో మధుమేహం విజృంభిస్తోంది.
యువతులు (40 ఏళ్ల లోపు)..వీరిలో టైప్-2 డయాబెటిస్ కేసుల నమోదు ఏకంగా 47 శాతం పెరిగింది.
మహిళలు (40 నుండి 79 ఏళ్లు)..ఈ వయసు వారిలో కేసుల పెరుగుదల కేవలం 22 శాతంగానే ఉంది.
యువకులు (40 ఏళ్ల లోపు)..ఇదే సమయంలో యువకుల్లో ఈ వ్యాధి పెరుగుదల 34 శాతంగా నమోదైంది.
వయసు పైబడిన వారితో పోలిస్తే, చిన్న వయసులోనే మధుమేహం రావడం వల్ల అది శరీరంలో మరింత తీవ్రమైన, వేగవంతమైన దుష్ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జెస్టేషనల్ డయాబెటిస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం .. ఒక రహస్య ముప్పు..!
గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (GDM) భవిష్యత్తులో శాశ్వత టైప్-2 డయాబెటిస్గా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో షుగర్ వచ్చిన మహిళల్లో.. డెలివరీ అయిన ఐదేళ్ల లోపే 11 శాతం మంది ‘ప్రీ-డయాబెటిస్’ బారిన పడుతున్నారు.
అయితే, ప్రసవం తర్వాత మహిళలకు అందాల్సిన సంరక్షణలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సగం మందికి పైగా మహిళలకే సరైన వార్షిక రక్త పరీక్షలు (HbA1c) అందుతున్నాయి. నివారణ కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంది.
"గర్భధారణ అనేది అనారోగ్యానికి రహదారి కాకూడదు. ప్రసవం తర్వాత సరైన పర్యవేక్షణ, అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది యువతులు తక్కువ వయసులోనే దీర్ఘకాలిక మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట పడాలి." అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి..?
చిన్న వయసులోనే మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్య నిపుణులుపలు సూచనలు చేస్తున్నారు.
ప్రసవానంతర పరీక్షలు..గర్భధారణ సమయంలో షుగర్ వచ్చిన మహిళలు, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఏటా తప్పనిసరిగా HbA1c పరీక్షలు చేయించుకోవాలి.
జీవనశైలిలో మార్పులు..జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ.. పీచు పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకోవాలి.
బరువు నియంత్రణ..అధిక బరువు, ఊబకాయం టైప్-2 డయాబెటిస్కు ప్రధాన కారణాలు కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
ముఖ్యంగా వెనుకబడిన, పేద వర్గాల మహిళల్లో ఈ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు పిలుపునిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
