పెరుగుతున్న కాలుష్యం కారణంగా పాఠశాలలు బంద్..
సాక్షి లైఫ్ : నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్)లో గాలి నాణ్యత తీవ్రంగా తగ్గిపోవడంతో అక్కడి అధికారులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. గౌతమ్ బుద్ధ నగర్లోనూ దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కారణంగా ఇక్కడ అన్ని పాఠశాలలు మూసివేశారు. నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున స్కూల్స్ మంగళవారం వరకు మూసివేయాలని నిర్ణయించారు.
అధికారుల ఆదేశాల మేరకు గ్రేటర్ నోయిడాలోని పాఠశాలలకు చెందిన పిల్లల తరగతులు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. గత వారం రోజులుగా నగరంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో, దారుణంగా నమోదవుతోంది. సోమవారం, నోయిడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ క్యూఐ) 278 వద్ద ,గ్రేటర్ నోయిడాలో 243 నమోదైంది. ఇది తీవ్రమైన స్థితిలో ఉంది. కాలుష్య స్థాయిలు పిల్లల ఆరోగ్యానికి హానికలిగిస్తాయి.
ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే..
ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
నోయిడాలో 35 పాయింట్లు పెరిగిన ఏ క్యూఐ..
పాఠశాలలను మూసివేసి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని డీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారంతో పోల్చితే సోమవారం కాలుష్య స్థాయి ఎక్కువగా ఉండగా, రెండు రోజులూ తీవ్రమైన కాలుష్య స్థాయి నమోదైంది. గత 24 గంటల్లో, నోయిడాలో ఏ క్యూఐ 35 పాయింట్లు , గ్రేటర్ నోయిడాలో 15 పాయింట్లు పెరిగింది.
ఇది కూడా చదవండి..జుట్టు రాలడానికి జీవనశైలి అలవాట్లు కూడా కారణమేనా..?
ఇది కూడా చదవండి..లివర్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర
ఇది కూడా చదవండి..చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
