సాక్షి లైఫ్ : వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. 2025లో వెలువడిన పలు పరిశోధనా ఫలితాలు భవిష్యత్తులో రోగుల చికిత్సా విధానాన్ని పూర్తిగా మార్చేయనున్నాయి. కృత్రిమ మేధ (AI), డిజిటల్ పరికరాలు, అత్యాధునిక స్కానింగ్ పద్ధతులు ప్రాణాంతక వ్యాధుల ముందస్తు గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
టైప్-2 మధుమేహానికి 'ఆటోమేటిక్' విరుగుడు..
ఇన్సులిన్ తీసుకునే టైప్-2 డయాబెటిస్ రోగులకు ఆటోమేటెడ్ ఇన్సులిన్ డెలివరీ (AID) వ్యవస్థ ఒక వరంలా మారింది. ఇటీవల చేసిన ప్రయోగాల్లో రోగుల షుగర్ స్థాయి (HbA1c) 8.2శాతం నుంచి 7.3శాతానికి తగ్గింది. ఈ మెషిన్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన మేర ఇన్సులిన్ను ఆటోమేటిక్గా విడుదల చేస్తుంది. దీనివల్ల షుగర్ అకస్మాత్తుగా పడిపోయే (Hypoglycaemia) ప్రమాదం ఉండదు.
అల్జీమర్స్ ముందస్తు గుర్తింపులో ఏఐ (AI) ..
అల్జీమర్స్ లక్షణాలు బయటపడక ముందే దానిని గుర్తించడం ఇప్పుడు సాధ్యమే. CARE-AD అనే మల్టీ-ఏజెంట్ ఏఐ ఫ్రేమ్వర్క్ ద్వారా రోగి పాత మెడికల్ రికార్డులను విశ్లేషించి, పదేళ్ల ముందే వ్యాధి వచ్చే అవకాశాన్ని 53శాతం ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. రోగ నిర్ధారణకు ఒక రోజు ముందు దీని ఖచ్చితత్వం 83శాతంగా ఉండటం విశేషం.
గర్భిణులకు రక్షణ కవచం: కొత్త మైక్రోనీడిల్ పరికరం..
ప్రసవ సమయంలో గర్భిణుల్లో వచ్చే 'సెప్సిస్' అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ ప్రాణాంతకమవుతుంది. శరీరంలో లాక్టేట్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే చిన్న మైక్రోనీడిల్ ప్యాచ్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. సూది గుచ్చాల్సిన అవసరం లేకుండా, చర్మంపై అతికించే ఈ ప్యాచ్ ద్వారా రియల్ టైమ్ డేటా లభిస్తుంది. దీనివల్ల అత్యవసర సమయంలో వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు.
కిడ్నీ నాణ్యతను తెలిపే 'హెచ్-స్కాన్' (H-Scan)..
కిడ్నీ మార్పిడి సమయంలో దాత నుంచి సేకరించిన అవయవం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం ఇప్పటివరకు కష్టంగా ఉండేది. ఇందుకోసం చేసే బయాప్సీ వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
'రీనల్ హెచ్-స్కాన్' అనే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా ఎటువంటి గాయం లేకుండానే కిడ్నీ పనితీరును, అందులోని ఫైబ్రోసిస్ అంటే దెబ్బతిన్న కణజాలంను ఖచ్చితంగా లెక్కించవచ్చు.
వర్చువల్ రియాలిటీతో మానసిక ప్రశాంతత..
తీవ్రమైన కుంగుబాటు (Depression), ఆందోళన (Anxiety)తో బాధపడే వారికి వర్చువల్ రియాలిటీ మెడిటేషన్ (IVRM) అద్భుత ఫలితాలను ఇస్తోంది. మందుల వాడకం తగ్గించి, రోగుల భావోద్వేగాలను నియంత్రించడంలో ఈ సాంకేతికత తోడ్పడుతోంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com