సాక్షి లైఫ్ : విద్యార్థులు వారి కుటుంబం లేదా సమాజం వారి పై పెట్టే లక్ష్యాల వల్ల ఒత్తిడి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితంచేస్తుంది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఏజ్ లో మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో టీనేజర్స్ లో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. విద్యార్థులు తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడి వారిలో ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల మనోభావాలను ప్రభావితం చేయవచ్చు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఆందోళనలకు, నిరాశకు దారితీస్తాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..? టెక్నాలజీ పెరగడంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమలేకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతోంది. నేటి యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈవీడియో చూసి తెలుసుకోండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com